హైదరాబాద్: లంక మళ్లీ ఫామ్లోకి వచ్చింది. బంగ్లాదేశ్ జట్టుతో తలపడి సిరీస్లో తొలి విజయాన్ని నమోదు చేసింది. బంగ్లాదేతో గురువారం జరిగిన తొలి టీ20 మ్యాచ్లో శ్రీలంక 6 వికెట్ల తేడాతో ఘనవిజయం సాధించింది. ముష్ఫికర్ రహీమ్ 44బంతుల్లో 66 పరుగులు చేసి నాటౌట్గా నిలిచాడు.
Sri Lanka won by 6 wickets (with 20 balls remaining) and take 1-0 lead in the 2-match T20I series!
— Sri Lanka Cricket (@OfficialSLC) February 15, 2018
SL 194/4 (16.4 Ovs) Kusal Mendis 53, Dasun Shanaka 42*, Thisara Perera 39*, Danushka Gunathilaka 30 v BAN 193/5.
This is Sri Lanka's highest chase in T20Is. #BANvSL pic.twitter.com/YfYty1DiI5
మిగిలిన బ్యాట్స్మెన్లు సౌమ్య సర్కార్ 32 బంతుల్లో 51, మహ్మదుల్లా 31 బంతుల్లో 43 పరుగులతో మెరిశారు. మొదట బంగ్లాదేశ్ 5 వికెట్లు నష్టపోయి 195 పరుగుల విజయ లక్ష్యాన్ని నిర్దేశించింది. బంగ్లా ఆటగాళ్లైన ముష్ఫికర్.. సర్కార్తో రెండో వికెట్కు 51, మహ్మదుల్లాతో నాలుగో వికెట్కు 73 పరుగులు జోడించారు.
Innings break: Bangladesh post 193/5 at the end of their 20 overs. Mushfiqur Rahim 66*, Soumya Sarkar 51 : Jeevan Mendis 2/21. Target 194.
— Sri Lanka Cricket (@OfficialSLC) February 15, 2018
LIVE: https://t.co/8ceiDBuKyM #BANvSL pic.twitter.com/pkWFsZLohu
లంక బౌలర్లు జీవన్ మెండిస్ రెండు వికెట్లు పడగొట్టాడు. ఛేదనలో శ్రీలంక చెలరేగిపోయింది. కుశాల్ మెండిస్ 27 బంతుల్లో 53, శనక 24 బంతుల్లో 42 పరుగులు చేసి నాటౌట్గా నిలిచారు. థిసార పెరీరా 39 విరుచుకుపడడంతో లక్ష్యాన్ని శ్రీలంక 16.4 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి ఛేదించింది.
నజ్ముల్ ఇస్లామ్ రెండు వికెట్లు పడగొట్టాడు. టీ20ల్లో లంకకు ఇదే అత్యధిక ఛేదన. చివరిదైన రెండో టీ20 ఆదివారం జరుగుతుంది.