
హైదరాబాద్: లంక మళ్లీ ఫామ్లోకి వచ్చింది. బంగ్లాదేశ్ జట్టుతో తలపడి సిరీస్లో తొలి విజయాన్ని నమోదు చేసింది. బంగ్లాదేతో గురువారం జరిగిన తొలి టీ20 మ్యాచ్లో శ్రీలంక 6 వికెట్ల తేడాతో ఘనవిజయం సాధించింది. ముష్ఫికర్ రహీమ్ 44బంతుల్లో 66 పరుగులు చేసి నాటౌట్గా నిలిచాడు.
మిగిలిన బ్యాట్స్మెన్లు సౌమ్య సర్కార్ 32 బంతుల్లో 51, మహ్మదుల్లా 31 బంతుల్లో 43 పరుగులతో మెరిశారు. మొదట బంగ్లాదేశ్ 5 వికెట్లు నష్టపోయి 195 పరుగుల విజయ లక్ష్యాన్ని నిర్దేశించింది. బంగ్లా ఆటగాళ్లైన ముష్ఫికర్.. సర్కార్తో రెండో వికెట్కు 51, మహ్మదుల్లాతో నాలుగో వికెట్కు 73 పరుగులు జోడించారు.
లంక బౌలర్లు జీవన్ మెండిస్ రెండు వికెట్లు పడగొట్టాడు. ఛేదనలో శ్రీలంక చెలరేగిపోయింది. కుశాల్ మెండిస్ 27 బంతుల్లో 53, శనక 24 బంతుల్లో 42 పరుగులు చేసి నాటౌట్గా నిలిచారు. థిసార పెరీరా 39 విరుచుకుపడడంతో లక్ష్యాన్ని శ్రీలంక 16.4 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి ఛేదించింది.
నజ్ముల్ ఇస్లామ్ రెండు వికెట్లు పడగొట్టాడు. టీ20ల్లో లంకకు ఇదే అత్యధిక ఛేదన. చివరిదైన రెండో టీ20 ఆదివారం జరుగుతుంది.