బలంగా కనిపిస్తున్న లక్నోను ధవన్ లేని పంజాబ్ జట్టు ఓడించింది. తద్వారా తాము ఎంత పవర్ ఫుల్ జట్టనే విషయాన్ని ప్రపంచానికి చాటిచెప్పింది. ఈ మ్యాచ్లో టాస్ ఓడి బ్యాటింగ్కు వచ్చిన లక్నో అనుకు్నంత స్కోరు చెయ్యలేకపోయింది. కేవలం కెప్టెన్ కేఎల్ రాహుల్ (74) ఒక్కడే ఒంటరి పోరాటం చేశాడు. అయితే చివరకు పంజాబ్ అసాధారణ పోరాటంతో మ్యాచ్ ఆ జట్టు వశమైంది.
.ఈ మ్యాచ్లో లక్నో ఓటమికి కేఎల్ రాహుల్ కెప్టెన్సీనే కారణమని కొందరు విమర్శలు చేస్తున్నారు. లక్నో టీంలో మోస్ట్ సక్సెస్ఫుల్ బౌలర్లలో రవి బిష్ణోయి ఒకడు. అలాంటి ప్లేయర్ను బరిలో దింపడానికి రాహుల్ తెగ ఆలోచించాడు. ఈ మ్యాచ్లో కేవలం 2.3 ఓవర్లు వేసిన అతను 18 పరుగులే ఇచ్చి రెండు కీలక వికెట్లు తీసుకున్నాడు. అతను బరిలో దిగే సరికే లక్నోకు జరగాల్సిన డ్యామేజ్ జరిగిపోయింది.

ఈ క్రమంలోనే సికందర్ రజా తన తొలి ఐపీఎల్ హాఫ్ సెంచరీతో ఆకట్టుకున్నాడు. దీంతో అతనికే 'ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్' అవార్డు కూడా దక్కింది. ఐపీఎల్లో ఈ అవార్డు అందుకున్న తొలి జింబాబ్వే ప్లేయర్గా రజా రికార్డు సృష్టించాడు. మళ్లీ చివర్లో షారూఖ్ ఖాన్ ధనాధన్ షాట్లు ఆడుతుండగా బిష్ణోయి చేతికి బంతి వెళ్లింది. సాధారణంగా 20వ ఓవర్ను స్పిన్నర్తో వేయించాడు. దీంతో రెచ్చిపోయిన షారూఖ్ బడా షాట్లతో తన జట్టును గెలిపించుకున్నాడు.
ఈ మ్యాచ్లో రవి బిష్ణోయి మొత్తం 2.3 ఓవర్లలో రెండు కీలక వికెట్లు తీసుకొన్నాడు. ఇదే విషయాన్ని ఎత్తి చూపుతున్న ఫ్యాన్స్.. రాహుల్ కెప్టెన్సీపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాడు. 14వ ఓవర్ వరకు బిష్ణోయి ఆడుతున్నాడని మర్చిపోయావా? అంటూ సెటైర్లు వేసేస్తున్నారు బిష్ణోయి కనుక కొంచెం ముందు వచ్చి ఉంటే మ్యాచ్ ఫలితం వేరేలా ఉండేదని అంటున్నారు. నిపుణులు కూడా బిష్ణోయిని 14వ ఓవర్ వరకు పక్కన పెట్టడం