
ఏదో ఒక సందర్భంలో అందరూ కబడ్డీ ఆడిన వారే
‘జీవితంలో అందరూ ఏదో సందర్భంలో కబడ్డీ ఆడిన వారే. ఓసారి ఈ మ్యాచ్ చూసేందుకు వెళ్లాను. కబడ్డీ ఎనర్జీ నన్ను ఆశ్చర్యానికి గురి చేసింది. అప్పటి నుంచి కబడ్డీపై మరింతగా మక్కువ పెంచుకున్నాను. మా జట్టు.. అభిమానుల మనస్సు గెలుచుకోవాలని కోరుకుంటున్నాను' అని సచిన్ తెలిపారు.

ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని యువతకు సచిన్ హితవు
ఏదో ఒక క్రీడలో పాల్గొంటూ ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని యువతకు సచిన్ సూచించారు. శారీరక వ్యాయమాలు లేకుండా క్రీడలకు దూరంగా ఉంటూ దేశంలో అనారోగ్య జనాభాను పెంచొద్దని హితవు పలికారు. అనారోగ్యాలతో 2020 వరకు జనాభా పరంగా మనదేశం చిన్నదిగా మారిపోవచ్చని, ఎందుకంటే స్థూలకాయంలో మన దేశం మూడోస్థానంలో ఉందని సచిన్ తెలిపారు.

ఢిఫెండర్గా టీమిండియా మాజీ కెప్టెన్ ధోని
దీని నుంచి బయటపడాలంటే క్రీడా కార్యకలాపాలు పెరగాలని, ప్రతి ఒక్కరు ఏదో ఒక ఆట ఆడాలని సచిన్ సూచించాడు. ఇక కబడ్డీలో డ్రీమ్ జట్టుపై అడగ్గా మాజీ కెప్టెన్ ధోని ఢిఫెండర్, సింగర్ శంకర్ మహాదేవన్ రైడర్ అని సరదాగా వ్యాఖ్యానించాడు. తమిళ తలైవాస్ జట్టు అంబాసిడర్గా ఉండేందుకు అంగీకరించిన కమల్ హాసన్కు సచిన్ ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.

హాజరైన నిమ్మగడ్డ ప్రసాద్, అల్లు అరవింద్, అల్లు అర్జున్, రామ్ చరణ్
ఈ జెర్సీ ఆవిష్కరణ కార్యక్రమంలో జట్టు సహ యజమానులు నిమ్మగడ్డ ప్రసాద్, అల్లు అరవింద్, అల్లు అర్జున్, రామ్ చరణ్లతోపాటు జట్టు బ్రాండ్ అంబాసిడర్గా వ్యవహరిస్తున్న కమల్ హాసన్ కూడా పాల్గొన్నారు. ఈ సీజన్లో తమిళ తలైవాస్ జట్టుకు కెప్టెన్గా అజయ్ ఠాకూర్, కోచ్గా కె.భాస్కరన్ వ్యవహరించనున్నారు.


Click it and Unblock the Notifications











