
బీసీసీఐ సర్వసభ్య సమావేశం
బీసీసీఐ ఆఫీస్ బేరర్లను పదవుల నుంచి తొలిగించి బోర్డు వ్యవహారాలను చక్కబెట్టేందుకు హోంశాఖ మాజీ కార్యదర్శి జీకే పిళ్లైను నియమించేందుకు ఆదేశించాలని ఇటీవలే లోధా కమటీ సుప్రీం కోర్టును కోరిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో శుక్రవారం బీసీసీఐ సర్వసభ్య సమావేశాన్ని నిర్వహించింది.

ఏ నిర్ణయం తీసుకున్నా కోర్టు ధిక్కారమే
‘మేం డిసెంబర్ 5 వరకు వేచి చూడాలని బీసీసీఐ ఆఫీస్ బేరర్లు అన్నారు. ఇప్పుడు ఏ నిర్ణయం తీసుకున్నా కోర్టు ధిక్కారమే అవుతుంది. కోర్టు వ్యతిరేకంగా తీర్పిస్తే ప్లాన్ బితో సిద్ధంగా ఉండాలని, రాజ్యాంగంలో మార్పులు చేసుకోని దానికి కట్టుబడి ఉండాలని పేర్కొన్నారు' అని ఓ రాష్ట్ర సంఘం యూనిట్ అధికారి ఒకరు తెలిపారు.

త్రిపుర, విదర్భ క్రికెట్ సంఘాలు గైర్హాజరు
ఈ సమావేశానికి లోధా కమిటీ సంస్కరణలకు పూర్తి మద్దతు ప్రకటించిన త్రిపుర, విదర్భ క్రికెట్ సంఘాల ప్రతినిధులు హాజరు కాలేదు. ఈ రెండు సంఘాలు లోధా కమిటీ సిఫార్సులు ఉన్నవి ఉన్నట్లు అమలు చేసేందుకు గతంలోనే అంగీకరించాయి. పొగమంచు వల్లే ఈ రెండు సంఘాల ప్రతినిధులు సమావేశానికి రాలేకపోయాయి.

లోధా కమిటీ సూచనలకు బోర్డు ససేమేరా
దానికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియజేశామని బీసీసీఐ కార్యదర్శి అజయ్షిర్కే వెల్లడించారు. లోధా ప్యానెల్ సూచించిన 70 ఏళ్ల గరిష్ట వయస్సు, మూడేళ్ల కూలింగ్ పీరియడ్, ఒక రాష్ట్రానికి ఒక ఓటు లాంటి ప్రతిపాదనలను బోర్డు ఆది నుంచి తీవ్రంగా వ్యతిరేకిస్తున్న విషయం తెలిసిందే.


Click it and Unblock the Notifications











