For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

లోధా సంస్కరణలు: మార్చి 24న విచారణ చేపట్టనున్న సుప్రీం

బీసీసీఐలో లోధా సంస్కరణ అమలుతో పాటు మిగతా సమస్యలపై మార్చి 24 (శుక్రవారం)న సుప్రీంకోర్టు విచారణ చేపట్టనుంది.

By Nageshwara Rao

హైదరాబాద్: బీసీసీఐలో లోధా సంస్కరణ అమలుతో పాటు మిగతా సమస్యలపై మార్చి 24 (శుక్రవారం)న సుప్రీంకోర్టు విచారణ చేపట్టనుంది. బీసీసీఐ, అనుబంధ సంఘాల్లో జస్టిస్‌ ఆర్‌ఎం లోధా కమిటీ సంస్కరణల అమలు, రైల్వేస్‌, సర్వీసెస్‌, భారత విశ్వవిద్యాలయాల సంఘం ఓటు హక్కుల పునరుద్ధరణ తదితర అంశాలపై సుప్రీం విచారణ చేయనుంది.

సుప్రీం కోర్టు న్యాయమూర్తులు దీపక్‌ మిశ్రా, ఏఎం ఖన్విల్కర్‌, డీవై చంద్రచూడ్‌లతో కూడిన ధర్మాసనం సోమవారం విచారణ చేపట్టకపోవడంతో శుక్రవారానికి వాయిదా పడింది. మరోవైపు బీసీసీఐకి సంబంధించిన కొన్ని అంశాలపై వాదించేందుకు తనకు రెండు గంటల సమయం అవసరమని అటార్నీ జనరల్‌ ముకుల్‌ రోహత్గీ సుప్రీంను కోరారు.

Lodha panel reforms: Supreme Court to hear BCCI issues on March 24

సోమవారం సీనియర్‌ న్యాయవాది అనిల్‌ దివాన్‌ అంత్యక్రియలకు హాజరు కావాలని విచారణను మరో రోజుకు వాయిదా వేయాలని బీసీసీఐ న్యాయవాది కపిల్‌ సిబల్‌ కోరారు. ఈ నేపథ్యంలో మార్చి 24కు విచారణను వాయిదా వేశామని జస్టిస్ మిశ్రా తెలిపారు.

Story first published: Monday, November 13, 2017, 12:14 [IST]
Other articles published on Nov 13, 2017
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+