
బ్యాట్ ఎడ్జ్ని తాకిందని ధీమా
అయితే, బంతి బ్యాట్ ఎడ్జ్ని తాకిందని ధీమా వ్యక్తం చేసిన మిచెల్ డీఆర్ఎస్ నిర్ణయానికి వెళ్లాడు. టీవీ రిప్లైని పరిశీలించగా.. హాట్స్పాట్లో బంతి బ్యాట్ ఎడ్జ్ తాకినట్లు స్పష్టంగా కనిపించింది. అయితే, అది బంతి తాకడంతో వచ్చిన గుర్తు కాదని వెల్లడించిన థర్డ్ అంపైర్ ఫీల్డ్ అంపైర్ నిర్ణయానికే బాసటగా నిలిచాడు.
బంతి బ్యాట్ను తాకలేదని
బంతి బ్యాట్ను తాకలేదని రిప్లైని పరిశీలించిన థర్డ్ అంపైర్ చెప్పడంతో ఫీల్డ్ అంపైర్ తన మునుపటి ఔట్ నిర్ణయానికే కట్టుబడ్డాడు. అయితే, థర్డ్ అంఫైర్ నిర్ణయంపై న్యూజిలాండ్ బ్యాట్స్మెన్ మిచెల్తో పాటు అప్పుడు క్రీజులో ఉన్న కెప్టెన్ కేన్ విలియమ్సన్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు.
మిచెల్ మైదానం వీడకుండా
మిచెల్ మైదానం వీడకుండా ఫీల్డ్ అంపైర్తో చర్చిందుకు ప్రయత్నించగా.. అప్పటికే నిర్ణయం వెల్లడించడంతో తాము వెనక్కి తీసుకోమని ఫీల్డ్ అంఫైర్లు స్పష్టం చేశారు. మరోవైపు న్యూజిలాండ్ కెప్టెన్ కేన్ విలియమ్సన్ మైదానంలోనే భారత్ కెప్టెన్ రోహిత్ శర్మతో కాసేపు ఆ ఔట్ నిర్ణయంపై చర్చిస్తూ.. ఆ ఔట్ అప్పీల్ని వెనక్కి తీసుకోవాల్సిందిగా సూచించాడు.
17 ఓవర్లకు న్యూజిలాండ్ 136/5
ఈ క్రమంలో రోహిత్ శర్మ కూడా అంపైర్ నిర్ణయమే శిరోధార్యం అనే తరహాలో విలియమ్సన్కి సమాధానం ఇవ్వడంతో చివరకు మిచెల్ నిరాశగా పెవిలియన్కు చేరాడు. ప్రస్తుతం 17 ఓవర్లకు గాను న్యూజిలాండ్ 5 వికెట్లు కోల్పోయి 136 పరుగులు చేసింది. క్రీజులో రాస్ టేలర్ (31), శాంట్నర్(3) పరుగులతో క్రీజులో ఉన్నారు.


Click it and Unblock the Notifications













