
ఆగస్టు 15తో తన కాల పరిమితి ముగియడంతో
భారత ఆర్మీలో గౌరవ లెప్టినెంట్ కల్నల్ హోదా కలిగిన ధోని ఆగస్టు 15తో తన కాల పరిమితి ముగియడంతో ఇంటికి చేరుకునేందు తిరుగు ప్రయాణం అయ్యాడు. ఈ రెండు వారాల పాటు కశ్మీర్ లోయలోని సైనికులతో కలిసి పెట్రోలింగ్, గార్డ్, పోస్ట్ గార్డ్ డ్యూటీలను ధోని నిర్వర్తించాడు. ఇందులో భాగంగా విక్టర్ ఫోర్స్లో ధోని పనిచేశాడు.

కశ్మీర్లోని విక్టర్ ఫోర్స్లో
విక్టర్ ఫోర్స్ కశ్మీర్లోని మిలిటెంట్ల ఏరివేతలో ప్రధాన భూమిక పోషిస్తుంది. ఇటీవలే కేంద్ర ప్రభుత్వం లడఖ్ను కేంద్ర ప్రాంతపాలిత ప్రాంతంగా ప్రకటించింది. 73వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలను పురస్కరించుకుని ధోని లఢఖ్లో జెండా ఎగురువేసిన సంగతి తెలిసిందే. అనంతరం ధోని జనరల్ ఆసుపత్రిని సందర్శించి.. పేషంట్లతో మాట్లాడాడు.

ఆర్మీ సీనియర్ అధికారి ఒకరు మాట్లాడుతూ
ఈ సందర్భంగా ఆర్మీ సీనియర్ అధికారి ఒకరు మాట్లాడుతూ "ధోని భారత సైన్యం యొక్క బ్రాండ్ అంబాసిడర్. అతడు తన యూనిట్ సభ్యులను ప్రేరేపించడంలో నిమగ్నమయ్యాడు. తోటి సైనికులతో ఫుట్బాల్, వాలీబాల్ ఆడాడు. ధోని కార్ప్స్తో యుద్ధ శిక్షణా వ్యాయామాలు కూడా నేర్చుకున్నాడు. ఆగస్టు 15 వరకు కశ్మీర్ లోయలోనే ఉన్నాడు" అని అన్నారు.

యురి, అనంతనాగ్లను సందర్శించిన ధోని
కశ్మీర్ లోయలో ధోని విధుల్లో ఉన్నప్పుడు యురి, అనంతనాగ్లను సైతం సందర్శించాడు. కాగా, ఆర్మీలో గౌరవ లెప్టినెంట్ కల్నల్ హోదాలో ఉన్న ధోని భారత ఆర్మీకి సేవలందించేందుకు గాను తనంతట తానుగా వెస్టిండిస్ పర్యటనకు దూరమయ్యాడు. 2015 సంవత్సరం ఆగ్రాలో ధోని తొలిసారి సైనిక పారాట్రూపర్ గా నెలరోజుల పాటు శిక్షణ తీసుకున్న సంగతి తెలిసిందే.


Click it and Unblock the Notifications












