హైదరాబాద్: క్రికెటర్ల నైపుణ్యానికి అసలైన సవాల్గా నిలిచే టెస్టు ఫార్మాట్ మనుగడ సాగించాలంటే డే అండ్ నైట్ టెస్టులే మార్గమని ఇంగ్లాండ్ మాజీ కెప్టెన్ కెవిన్ పీటర్సన్ తేల్చి చెప్పాడు. మంగళవారం ప్రతిష్ఠాత్మక ఎంఏకే పటౌడీ స్మారకోపన్యాసంలో పీటర్సన్ మాట్లాడాడు. ఈ ఘనత సాధించిన తొలి విదేశీ క్రికెటర్గా కూడా అతడు నిలిచాడు.
'టెస్టు క్రికెట్ మనుగడ సాగించాలంటే మరింత మార్కెటింగ్ చేయడం అవసరం. ప్రపంచ టెస్టు చాంపియన్షిప్ కూడా ఇందుకు దోహదపడుతుంది. తక్కువ దరలకు టిక్కెట్లను అమ్ముతూ టీవీ ప్రేక్షకులకు మరింత ఆకర్షణగా ప్రసారాలు చేయాల్సి ఉంటుంది. స్టేడియంలో వినోదం పెంచాలి. పరిమితంగానైనా స్లెడ్జింగ్కు అనుమతించాలి. ముఖ్యంగా సాయంకాలాల్లో మ్యాచ్లు ప్రారంభమైతే మరీ మంచిది' అని పీటర్సన్ అన్నాడు.
ఈ సందర్భంగా ఐపీఎల్ను డే అండ్ నైట్ టెస్టు ఫార్మాట్తో పోల్చి చెప్పాడు. ఐపీఎల్ లాంటి షార్ట్ ఫార్మాట్లో ఆడటంతో నైపుణ్యం బయటపడదు. అదే విధంగా డే అండ్ నైట్ టెస్టును ప్రజల్లోకి తీసుకెళ్లాల్సి ఉంటుంది. టెలివిజన్ ప్రసారాలకోసం పెట్టుబడిదారులను సంపాదించుకోవాల్సి ఉంది. ఈ సిరీస్ను ఎంటర్టైన్మెంట్తో పోల్చి చూడడం ఎంతవరకూ సబబు కాదు.'
ఐపీఎల్లో హోరు, వేగం, దూకుడు ఇవే కనిపిస్తాయే కానీ, గురి, సహనం అనేవి ఎంతమాత్రం కనపడవు. అదే ఈ టెస్టు సిరీస్లో అయితే ఆట మీద శ్రద్ధ, క్రికెట్ పై ఉన్న నిబద్ధత సాంప్రదాయ క్రికెట్ను కాపాడుకునేలా చేస్తాయని పిలుపునిచ్చాడు. టెస్టు క్రికెట్.. సచిన్, వార్న్, మార్షల్, స్టీవ్ వా, హ్యాడ్లీ, కపిల్తో పాటు హన్సీ క్రోనేలాంటి ఎంతో మంది దిగ్గజాలను అందించిందని గుర్తుచేసుకున్నాడు.