కరాచీ: ఐపియల్ గందరగోళంగా తయారు కావడంపై తనకు ఆశ్చర్యమేమీ కలగడం లేదని పాకిస్తాన్ క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్ జావెద్ మియాందాద్ అన్నారు. ఐపియల్ వ్యవహారాలను భవిష్యత్తులు అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసిసి) పర్యవేక్షించాలని ఆయన సూచించారు. ఐపియల్ లో భారీ వాటాలను దృష్టిలో ఉంచుకుని ఆ క్రీడను ఐసిసి పర్యవేక్షించడం మంచిదని ఆయన అన్నారు. బోర్డులను కాదని ప్రైవేట్ ఎంటర్ ప్రైజ్ లు నేరుగా క్రీడాకారులతో సంబంధాలు పెట్టుకుంటే ఇటువంటి సమస్యలు తప్పవని ఆయన అన్నారు. సరైన పర్యవేక్షణ, తనిఖీలు లేకుండా ఇటువంటి ప్రైవేట్ ఎంటర్ ప్రైజెస్ లు పని చేయడానికి ఏ బోర్డును కూడా అనుతించ కూడదని ఆయన అన్నారు. ఐపియల్ లో క్రీడాకారులతో నేరుగా సంబంధాలు పెట్టుకునేలా అనుతించడం తప్పుడు ధోరణి అని ఆయన అన్నారు.