
బేబి సిట్టర్ సోషల్ మీడియాలో వైరల్
ఆ తర్వాత టీమిండియా వన్డే కెప్టెన్ రోహిత్ శర్మ సైతం ట్విట్టర్లో తన కూతురిని ఆడిస్తావా? అని పంత్ని అడగడంతో బేబి సిట్టర్ అనే పదం సోషల్ మీడియాలో కూడా తెగ వైరల్ అయింది. త్వరలో భారత్లో టీమిండియా-ఆస్ట్రేలియా జట్ల మధ్య సుదీర్ఘ సిరిస్ ప్రారంభం కానున్న నేపథ్యంలో స్టార్ స్పోర్ట్స్ మాజీ డాషింగ్ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్తో ఓ కమర్షియల్ యాడ్నే రూపోందించింది.

సెహ్వాగ్తో వీడియో రూపొందించిన స్టార్ స్పోర్ట్స్
ఆస్ట్రేలియా జట్టు భారత పర్యటనలో భాగంగా రూపొందించిన ఈ యాడ్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అయింది. దీంతో బేబిసిట్టర్ అనే పదం ఇంతలా పాపులర్ కావడానికి కారకుడైన రిషబ్ పంత్ ఈ వీడియోపై ట్విట్టర్లో స్పందించాడు.
రిషబ్ పంత్ స్పందన
"వీరూ పాజీ.. గొప్ప క్రికెటర్గా.. బేబీ సిట్టర్గా ఎలా ఉండాలో చూపించారు. స్పూర్తిదాయకమైన వీడియో" అంటూ ట్విట్టర్లో ట్వీట్ చేశాడు. ఆస్ట్రేలియా జట్టు భారత పర్యటనలో భాగంగా రెండు టీ20లు, ఐదు వన్డేల సిరీస్ ఆడనుంది. ఈ ఫిబ్రవరి 24న ప్రారంభమయ్యే తొలి టీ20తో ఈ సిరీస్ ఆరంభం కానుంది.


Click it and Unblock the Notifications













