సిరీస్లో బాగానే ఆడినప్పటికీ
న్యూజిలాండ్తో టీ20 సిరీస్లో తనను మూడో స్థానంలో ఆడించడం ఆశ్చర్యంతో కూడిన సంతోషాన్ని కలిగించిందని శంకర్ చెప్పాడు. సిరీస్లో బాగానే ఆడినప్పటికీ.. ఇంకా ఎక్కువ పరుగులు చేయకపోవడం, మూడో టీ20లో జట్టును గెలిపించలేకపోవడం నిరాశ కలిగించిందని తెలిపాడు. రాబోయే రోజుల్లో జట్టులో తన స్థానాన్ని సుస్థిరం చేసుకోవడానికి ప్రయత్నిస్తానని వెల్లడించాడు.
రెండు, మూడు మ్యాచ్ల్లో మూడో స్థానంలో
న్యూజిలాండ్తో ముగిసిన మూడు టీ20ల సిరిస్లో రెండు, మూడు మ్యాచ్ల్లో మూడో స్థానంలో(ఫస్ట్డౌన్) బ్యాటింగ్కు దిగిన విజయ్ శంకర్ అభిమానులను అలరించాడు. హామిల్టన్ వేదికగా ఆదివారం న్యూజిలాండ్తో జరిగిన టీ20లో విజయ్ శంకర్ 28 బంతుల్లో 5 ఫోర్లు, 2 సిక్సర్లతో 43 పరుగులు సాధించాడు.
వరల్డ్ కప్ జట్టులో విజయ్ శంకర్ కూడా
దీంతో వరల్డ్ కప్ జట్టులో విజయ్ శంకర్ కూడా తన ప్రణాళికల్లో ఉన్నాడంటూ ఎమ్మెస్కే ప్రసాద్ వెల్లడించాడు. ఏప్రిల్ 23లోపు భారత జట్టుని ప్రకటించాల్సి ఉండటంతో సెలక్టర్లు ఆ పనిలో బిజీగా ఉన్నారు. ఒకటి, రెండు స్థానాలు తప్ప ఇప్పటికే దాదాపు అన్ని బెర్తులు ఖరారయ్యాయని ఇప్పటికే చీఫ్ సెలక్టర్ ఎమ్మెస్కే ప్రసాద్ పేర్కొన్నాడు.