
ఈ ఏడాది ఆరంభంలో కేప్ టౌన్ వేదికగా శ్రీలంక-దక్షిణాఫ్రికా జట్ల మధ్య జరిగిన టీ20 మ్యాచ్లో కూడా లారెన్ అజెన్బ్యాగ్ అంఫైర్గా వ్యవహారించారు. ఫలితంగా క్రికెట్ దక్షిణాఫ్రికా తరుపున ఓ టీ20 మ్యాచ్కి అంఫైర్గా వ్యవహారించిన తొలి మహిళగా నిలిచారు. దీంతో పాటు ఐసీసీ మహిళల అంఫైర్ ప్యానెల్లో కూడా సభ్యురాలుగా ఉన్నారు.
ఈ విషయమై క్రికెట్ దక్షిణాఫ్రికా క్రికెట్ యాక్టింగ్ డైరెక్టర్ కోర్రీ మాట్లాడుతూ "లారెన్ దక్షిణాఫ్రికాలో మహిళల అంపైరింగ్కు స్టాండర్డ్ బేరర్గా మారారు. వ్యక్తిగత కలలను సాకారం చేసుకునేందుకు అవసరమైన అంకితభావం ఉంటే సాధించడానికి పరిమితి ఏదీ లేదని ఆమె చూపించింది" అని అన్నారు.