మ్యాచ్ విన్నర్ మలింగనే:
మలింగ వన్డేలకు గుడ్బై చెప్పిన నేపథ్యంలో రోహిత్ శర్మ తన అధికారిక ట్విట్టర్ వేదికగా స్పందించాడు. 'గత దశాబ్ద కాలంలో ముంబై ఇండియన్ తరపున ఒక మ్యాచ్ విన్నర్ను ఎంచుకోమంటే.. మలింగ ముందు వరుసలో ఉంటాడు. కెప్టెన్గా క్లిష్ట పరిస్థితుల్లో ఉన్న నాకు ఎంతో అండగా నిలిచాడు. కొన్ని సందర్భాల్లో ఊపిరి పీల్చుకోవడానికి మలింగనే కారణం. వైవిధ్యమైన బంతులతో జట్టుకు ఎన్నో విజయాలు అందించాడు. భవిష్యత్తులో అతనికి మంచి జరగాలని కోరుకుంటున్నా' అని రోహిత్ పేర్కొన్నాడు.
నీ బౌలింగ్ స్పెల్ క్లాసిక్:
టీమిండియా స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రా కూడా మలింగ రిటైర్మెంట్పై ట్వీట్ చేశాడు. 'నీ బౌలింగ్ స్పెల్ ఓ క్లాసిక్. క్రికెట్కు మీరు చేసిన అద్భుతమైన సేవలకు ధన్యవాదాలు. మీరు అంటే ఎప్పుడూ అభిమానమే, దాన్ని అలానే కొనసాగిస్తా' అని బుమ్రా ట్విటర్లో రాసుకొచ్చారు. మలింగ, రోహిత్, బుమ్రా ఐపీఎల్లో ముంబయి ఇండియన్స్కు ప్రాతినిథ్యం వహిస్తున్న విషయం తెలిసిందే.
నా సమయం ముగిసింది:
బంగ్లాదేశ్ మ్యాచ్ అనంతరం మలింగ మాట్లాడుతూ... 'వన్డేల నుంచి రిటైర్ అవ్వడానికి ఇదే సరైన సమయం అనిపించింది. గత 15 సంవత్సరాలుగా శ్రీలంక జట్టుకు ప్రాతినిధ్యం వహించా. నా సమయం ముగిసింది. ఇక నేను వెళ్లాలి. లంక జట్టులో కొంతమంది యువ బౌలర్లు మంచి సామర్థ్యాన్ని కలిగి ఉన్నారు. యువ బౌలర్లు మ్యాచ్ విన్నింగ్ స్పెల్స్ను ప్రయత్నించాలి. ప్రతి ఒక్కరూ జట్టుకు మ్యాచ్ విన్నర్ కావాలి' అని మలింగ పేర్కొన్నాడు.