హైదరాబాద్: ఐసీసీ శనివారం విడుదల చేసిన టీ20 ర్యాంకింగ్స్లో శ్రీలంక వెటరన్ పేసర్ లసిత్ మలింగ ఒకేసారి 20 స్థానాలు ఎగబాకాడు. న్యూజిలాండ్తో జరిగిన మూడో టీ20లో మలింగ నాలుగు బంతుల్లో నాలుగు వికెట్లు తీసి జట్టు విజయంలో కీలకపాత్ర పోషించిన సంగతి తెలిసిందే.
నోరు పారేసుకున్న ఇంగ్లాండ్ అభిమాని: డేవిడ్ వార్నర్ ఏం చేశాడో తెలుసా! (వీడియో)
తాజా ప్రదర్శనతో ర్యాంకింగ్స్లో 41వ స్థానంలో ఉన్న మలింగ 21వ స్థానంలో నిలిచాడు. శుక్రవారం న్యూజిలాండ్తో జరిగిన ఆఖరి టీ20లో మలింగ మొత్తం ఐదు వికెట్లు పడగొట్టాడు. ఆప్ఘనిస్థాన్ బౌలర్ రషీద్ ఖాన్ తన అగ్రస్థానాన్ని కాపాడుకున్నాడు. కివీస్ స్పిన్నర్ మిచెల్ శాంట్నర్ ఆరు స్థానాలు ఎగబాకి ఐదో స్థానంలో నిలిచాడు.
ఈ మూడు టీ20ల సిరిస్లో నాలుగు వికెట్లు తీసి 2-1తో కైవసం చేసుకోవడంలో మిచెల్ శాంట్నర్ కీలకపాత్ర పోషించాడు. మరోవైపు భారత్ నుంచి టాప్-10లో చైనామన్ స్పిన్నర్ కుల్దీప్ యాదవ్ చోటు దక్కించుకున్నాడు. తాజా ర్యాంకింగ్స్లో కుల్దీప్ యాదవ్ 8వ స్థానంలో నిలిచాడు.
యుఎస్ ఓపెన్లో సెరెనా vs బియాంక: ఎవరు గెలిచినా చరిత్రే!, మ్యాచ్ ఎప్పుడంటే!
మరోవైపు బ్యాట్స్మెన్ టీ20 ర్యాంకింగ్స్లో పాక్ క్రికెటర్ బాబర్ అజాం తన అగ్రస్థానాన్ని నిలబెట్టుకున్నాడు. రెండో స్థానంలో గ్లెన్ మ్యాక్స్వెల్.. కొలిన్ మున్రో మూడో స్థానంలో నిలిచాడు. ఇక, టీమిండియా కేఎల్ రాహుల్, రోహిత్ శర్మలు టాప్-10లో నిలిచారు. రాహుల్ 7వ స్థానంలో నిలవగా... రోహిత్ 9వ స్థానంలో నిలిచాడు.