టాప్ జట్టు చేతిలో ఓడాం:
పాక్ బ్యాట్స్మన్లలో షాన్ మసూద్ (68), అసద్ షఫీక్ (57), యాసిర్ షా (113), బాబర్ ఆజామ్ (97)లు రాణించినా జట్టును ఆదుకోలేకపోయారు. మ్యాచ్ అనంతరం పాక్ కెప్టెన్ అజర్ అలీ మాట్లాడుతూ... 'ఆస్ట్రేలియా జట్టును అభినందించాలనుకుంటున్నా, ముఖ్యంగా డేవిడ్ వార్నర్ను. వార్నర్ అద్భుతంగా ఆడాడు. మేము టాప్ జట్టు చేతిలో ఓడిపోయాం. అయితే అన్ని విభాగాల్లో పూర్తిగా విఫలమయ్యాం' అని తెలిపాడు.
అన్ని విభాగాల్లో విఫలమయ్యాం:
'టెస్టు మ్యాచ్లు గెలవాలంటే 20 వికెట్లు తీయాలి. ఆసీస్లో 20 వికెట్లు తీయాలంటే ఎంతో సాధన అవసరం. ఆటలో పైచేయి సాధించడం చాలా ముఖ్యం. రెండు టెస్టుల్లో అన్ని విభాగాల్లో విఫలమయ్యాం. అయితే మేం సానుకూలాంశాలను పరిగణలోకి తీసుకుంటాం. బాబర్ ఈ సిరీస్లో అద్భుతంగా రాణించాడు. ఎటువంటి సందేహం లేదు, అతను భవిష్యత్తులో పాకిస్తాన్ జట్టులో టాప్ ఆటగాడు అవుతాడు. యాసిర్ షా అద్భుతమైన పోరాటం చేశాడు' అని అలీ పేర్కొన్నాడు.
ఆశించిన స్థాయిలో ఆడలేకపోయాం:
'ఇక్కడి పరిస్థితులకు త్వరగా అలవాటు పడి, సరైన భాగస్వామ్యాలు నిర్మించాల్సి ఉండే. పేస్, బౌన్స్కు అలవాటు పడితే ఇక్కడ పరుగులు చేయొచ్చు. గుడ్ లైన్ అండ్ లెంగ్త్లో బౌలింగ్ చేయకపోతే.. ఆసీస్ బ్యాట్స్మన్ త్వరగా పరుగులు చేయగలరు. వారిని నియంత్రించాలంటే మంచి ఫీల్డింగ్ కూడా ఉండాలి. ఎన్నో ఆశలతో ఈ పర్యటనకు వచ్చినా.. మేం ఊహించినట్టు జరగలేదు. ఈ ఓటమితో చాలా నేర్చుకోవాలి. అద్భుతమైన ఆతిథ్యం ఇచ్చిన క్రికెట్ ఆస్ట్రేలియాకు ధన్యవాదాలు. ప్రేక్షకులు కూడా ఆదరించారు' అని అజర్ చెప్పుకొచ్చాడు.
టెస్టు చాంపియన్షిప్లో ఆస్ట్రేలియా 120 పాయింట్లు:
రెండు టెస్టుల సిరీస్ను 2-0తో కైవసం చేసుకుని.. ఐసీసీ టెస్టు చాంపియన్షిప్లో ఆస్ట్రేలియా 120 పాయింట్లు సాధించింది. 'మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్, సిరీస్; అవార్డులు వార్నర్కే దక్కాయి. 1999 నుంచి ఇప్పటి వరకు ఐదు సార్లు ఆస్ట్రేలియాలో పర్యటించిన పాక్.. ఒక్క మ్యాచ్ అయినా గెలవలేదు. 20 ఏళ్లలో ఆసీస్ గడ్డపై 14 టెస్టులు జరగ్గా.. అన్నింటిలో పాక్ ఓడింది. కనీసం ఒక్క మ్యాచ్ కూడా 'డ్రా' కాలేదు.