IND vs WI: భారత్తో ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియం వేదికగా జరుగుతున్న రెండో టెస్ట్ మ్యాచ్లో వెస్టిండీస్ జట్టు తమ మొదటి ఇన్నింగ్స్లో కేవలం 248 పరుగులకే ఆలౌట్ అయింది. ఈ టెస్ట్ సిరీస్లో వెస్టిండీస్ బ్యాటింగ్ మరోసారి విఫలమైంది. మూడో రోజు మొదటి సెషన్లోనే వెస్టిండీస్ ఇన్నింగ్స్ ముగిసింది. మొదట బ్యాటింగ్ చేసిన భారత్ 5 వికెట్ల నష్టానికి 518 పరుగులు చేసింది. ఈ నేపథ్యంలో భారత జట్టుకు 270 పరుగుల భారీ ఆధిక్యం లభించింది. అంటే వెస్టిండీస్ జట్టు ఫాలోఆన్ను కూడా సాధించలేకపోయింది. ఈ సిరీస్లో వెస్టిండీస్ 200 పరుగుల మార్కును దాటడం ఇదే మొదటిసారి. భారత బౌలర్లలో కుల్దీప్ యాదవ్ అద్భుతంగా రాణించి 5 వికెట్లు పడగొట్టాడు.
కుల్దీప్ యాదవ్ సంచలనం
మూడో రోజు వెస్టిండీస్ తమ స్కోరు 4 వికెట్లకు 140 పరుగుల నుండి ఆట ప్రారంభించింది. కుల్దీప్ యాదవ్ వేసిన మొదటి స్పెల్ భారత జట్టుకు బాగా కలిసొచ్చింది. కుల్దీప్ వెస్టిండీస్ కీలక బ్యాటర్ షాయ్ హోప్ను (36 పరుగులు) బౌల్డ్ చేశాడు. ఆ తర్వాత టెవిన్ ఇంలాచ్ను కూడా కుల్దీప్ ఎల్బీడబ్ల్యూ చేశాడు. మూడో రోజు భారత్కు మూడో వికెట్ను అందించిన కుల్దీప్, జస్టిన్ గ్రీవ్స్ను (18 పరుగులు) కూడా ఎల్బీడబ్ల్యూ చేశాడు.

9వ వికెట్ భాగస్వామ్యం ప్రతిఘటన
మహ్మద్ సిరాజ్ జోమెల్ వారికన్ను బౌల్డ్ చేయడంతో వెస్టిండీస్ 8వ వికెట్ను 175 పరుగులకే కోల్పోయింది. అయితే, ఆ తర్వాత క్రీజులోకి వచ్చిన ఖారీ పియరీ, అండర్సన్ ఫిలిప్ జోడీ భారత బౌలర్లను కొంతవరకు ఇబ్బంది పెట్టింది. మొదటి సెషన్లో ఈ ఇద్దరూ కలిసి 42 పరుగులు జోడించారు. కానీ, లంచ్ తర్వాత వేసిన మొదటి ఓవర్లోనే జస్ప్రీత్ బుమ్రా, పియరీని (23 పరుగులు) బౌల్డ్ చేశాడు ఆఖరి వికెట్కు ఫిలిప్, జైడెన్ సీల్స్ జోడీ మరో 27 పరుగులు జోడించి భారత్ను కొంత నిరాశపరిచింది. చివరకు కుల్దీప్ యాదవ్, సీల్స్ను ఔట్ చేసి వెస్టిండీస్ ఇన్నింగ్స్కు ముగింపు పలికాడు.
బౌలింగ్ గణాంకాలు: కుల్దీప్ యాదవ్ (5/82), రవీంద్ర జడేజా 3 వికెట్లు, మహ్మద్ సిరాజ్, జస్ప్రీత్ బుమ్రా చెరో 1 వికెట్ తీశారు. భారత్ 270 పరుగుల భారీ ఆధిక్యంతో వెస్టిండీస్కు ఫాలోఆన్ ఇచ్చి మ్యాచ్పై పూర్తి పట్టు సాధించింది.