ఓ బంతికి ఫోర్ లెగ్బైస్ రాగా
ఓ బంతికి ఫోర్ లెగ్బైస్ రాగా.. లెగ్స్టంప్ యార్కర్ను ఆడి నర్స్ రెండు పరుగులు రాబట్టాడు. తర్వాత ఫుల్టాస్ను స్కూప్ చేసి థర్డ్మాన్లో ఫీల్డర్కు దొరికిపోయాడు. చివరి 2 బంతులకు 7 పరుగులు అవసరం కాగా.. స్టంప్స్ పైకి వేసిన మరో ఫుల్టాస్ను హోప్ సరిగా ఆడలేకపోయాడు. బంతిని డీప్మిడ్వికెట్లోకి పంపి 2 పరుగులు తీశాడు. దీంతో ఆఖరి బంతికి వెస్టిండిస్కు 5 పరుగులు అవసరమయ్యాయి.
ధోని ఆఖరి బంతికి మాత్రం ఫీల్డింగ్ను మార్చేశాడు
ఈ ఓవర్కు వ్యూహ రచన చేసిన ధోని ఆఖరి బంతికి మాత్రం ఫీల్డింగ్ను మార్చేశాడు. థర్డ్మ్యాన్ను మరి కాస్త లోపలకు తీసుకొచ్చి పాయింట్ ఫీల్డర్ను డీప్ బ్యాక్వర్డ్ పాయింట్ వద్దకు పంపించాడు. స్వీపర్ కవర్, లాంగాఫ్ను కూడా తప్పించాడు. అయితే ఈ వ్యూహం వ్యతిరేకంగా పని చేసి ఆఖరి బంతిని హోప్ ఫోర్ కొట్టి మ్యాచ్ను ‘టై'గా ముగించాడు.
కుల్దీప్ యాదవ్ను ప్రశ్నించగా అతను భిన్నంగా
ఈ విషయంపై మ్యాచ్ తర్వాత మీడియా సమావేశంలో కుల్దీప్ యాదవ్ను ప్రశ్నించగా అతను భిన్నంగా స్పందించాడు. "ఇది ధోని ప్రణాళిక. దాని గురించి తెలిసేంత పెద్దవాడిని కాను. నేను 30 మ్యాచ్లు మాత్రమే ఆడాను. మహి భాయ్ 300 మ్యాచ్లు ఆడాడు. మా అందరికంటే అతనికి చాలా ఎక్కువ అనుభవం ఉంది. ఆ సమయంలో అతను అనుకున్నది అమలు చేశాడు" అని కుల్దీప్ అన్నాడు.
పది నెలల క్రితం జరిగిన ఒక ఘటనను గుర్తు చేసుకొని
పది నెలల క్రితం జరిగిన ఒక ఘటనను గుర్తు చేసుకొని కుల్దీప్ ఈ వ్యాఖ్యలు చేసినట్లుగా క్రికెట్ విశ్లేషకులు భావిస్తున్నారు. ఇండోర్ వేదికగా శ్రీలంకతో జరిగిన టి20 మ్యాచ్లో ధోని ఫీల్డింగ్ మార్పులు చేస్తూ కవర్ను తప్పించి పాయింట్ను మరింత ముందుకు తీసుకు రమ్మని బౌలర్ కుల్దీప్కు సూచించాడు. అయితే ధోని మాటను కుల్దీప్ లెక్కచేయకపోవడంతో చిర్రెత్తిన ధోని ‘300 మ్యాచ్లు ఆడిన నేనేమైనా పిచ్చివాడినా' అంటూ ఆగ్రహం వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే.