ఒంగోలు: మైక్రోమాక్స్ రంజీ ట్రోఫీ క్రికెట్ టోర్నీలో భాగంగా ప్రకాశం జిల్లా ఒంగోలులోని శర్మ కళాశాల మైదానంలో గోవా జట్టుతో జరుగుతున్న మ్యాచులో ఆంధ్రా ఆటగాడు కెఎస్ భరత్ రికార్డు సృష్టించాడు. రంజీ క్రికెట్ చరిత్రలోనే ఆంధ్రా నుంచి తొలి త్రిశతకం నమోదు చేశాడు.

మ్యాచ్ తొలిరోజు ఆట ముగిసే సమయానికి 226 పరుగులతో పరుగులతో అజేయంగా నిలిచిన భరత్ రెండో రోజైన శనివారం భోజన విరామ సమయానికి ముందే త్రిశతకం నమోదు చేశాడు. గోవా బౌలర్లను చితక్కొట్టిన భరత్.. దాదాపు 4.53 రన్ రేట్తో పరుగులు సాధించడం విశేషం.
అనంతరం భారీ షాట్కు ప్రయత్నించి 305 పరుగుల వద్ద ఔట్ అయ్యాడు. భోజన విరామ సమయానికి ఆంధ్రా జట్టు 120 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 545 పరుగులు చేసింది.