హైదరాబాద్: కర్ణాటక ప్రీమియర్ లీగ్ (కేపీఎల్) ఫిక్సింగ్ కుంభకోణం దర్యాప్తులో భాగంగా గురువారం సెంట్రల్ క్రైమ్ బ్రాంచ్ (సిసిబి) పోలీసులు కర్ణాటక స్టేట్ క్రికెట్ అసోసియేషన్ కార్యదర్శి సంతోష్ మీనన్ ఇంటిపై దాడులు నిర్వహించారు.
సంతోష్ ఇంటిపై దాడులు నిర్వహించడానికి అవసరమైన వారెంట్ను నగర కోర్టు నుండి తీసుకున్నట్లు పోలీసు అధికారులు ఈ సందర్భంగా తెలిపారు. కర్ణాటక ప్రీమియర్ లీగ్(కేపీఎల్) ఫిక్సింగ్ కుంభకోణానికి సంబంధించిన తాజా దాడుల్లో ఇదొకటి.
సల్మాన్ను వెనక్కి నెట్టిన కోహ్లీ: ఫోర్బ్స్ టాప్-100 సెలబ్రిటీల జాబితాలో అగ్రస్థానం
ఇప్పటికే ఫిక్సింగ్కు సంబంధించి మాజీ కర్ణాటక రంజీ ప్లేయర్, మాజీ బెళగావి పాంథర్స్ కోచ్ సుధీంద్ర షిండేను బుధవారం(డిసెంబర్ 4)న క్రైమ్ బ్రాంచ్ పోలీసులు అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. షిండే ప్రస్తుతం కర్ణాటక అండర్ -19 జట్టు కోచ్గా విధులు నిర్వహించడంతో పాటు రాయచూర్ జోన్ నుండి కేఎస్సీఏ మేనేజింగ్ కమిటీ సభ్యుడిగా ఉన్నాడు.
డెక్కెన్ హెరాల్డ్లో ప్రచురించిన వార్తా కథనం ప్రకారం షిండే తన అసోసియేషన్ టీమ్ ఓనర్ అలీ ఆస్ఫక్ తారాతో కలిసి కేపీఎల్లో పలు మ్యాచ్లు ఫిక్సింగ్ చేసినట్లు పోలీసులు వెల్లడించారు. జాయింట్ కమిషన్ ఆఫ్ పోలీసు(క్రైమ్) సందీప్ పాటిల్ మాట్లాడుతూ బుధవారం షిండేను మెజిస్ట్రేట్ వద్ద హాజరు పరిచినట్లు తెలిపారు.
అయ్యో అయ్యర్.. హాఫ్ సెంచరీ కాకముందే సంబరాలు.. నవ్వుకున్న కోహ్లీ!!
ఈ ఫిక్సింగ్లో అతడితో పాటు మరెవరైనా ఉన్నారనే విషయాలను కనుగొనేందుకు అతడిని కష్టడీకి కోరుతామని చెప్పారు. అంతకముందు షిండేకు బిజాపుర్ బుల్స్తో కూడా అనుబంధం ఉంది. షిండే, తారాకు ముందు క్రైమ్ బ్రాంచ్ పోలీసులు భావేష్ భప్నా(ఫాంథర్స్ డ్రమ్మర్), బెంగళూరు బ్లాస్టర్స్ ఆటగాళ్లు నిషాంత్ సింగ్ షెకావత్, ఎమ్ విశ్వనాథ్, బౌలింగ్ కోచ్ విను ప్రసాధ్, బళ్లారి టస్కర్స్ కెప్టెన్ సీఎమ్ గౌతమ్ తదితరులను అరెస్ట్ చేశారు.