పాంటింగ్ రికార్డుని సమం చేసిన కోహ్లీ
తద్వారా అంతర్జాతీయ క్రికెట్లో వరుసగా అత్యధిక టెస్టు సిరిస్ విజయాలు సాధించిన ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ రికీ పాంటింగ్ రికార్డుని కోహ్లీ సమం చేశాడు. 2005 నుంచి 2008 మధ్య కాలంలో పాంటింగ్ నేతృత్వంలోని ఆస్ట్రేలియా జట్టు వరుసగా తొమ్మిది సిరీస్లను గెలిచింది. ఇంగ్లాండ్ కూడా 1884 నుంచి 1892 మధ్యకాలంలో 9 టెస్టు సిరీస్ విజయాలు సాధించింది.
తొలి టెస్టు సిరిస్ను లంకపై గెలిచిన కోహ్లీ
2015లో ధోని నుంచి టెస్టు కెప్టెన్సీ పగ్గాలను అందుకున్న కోహ్లీ తొలి టెస్టు సిరిస్ను లంకపైనే గెలిచాడు. ఆ తర్వాత దక్షిణాఫ్రికా (సొంతగడ్డపై), 2016లో వెస్టిండిస్ (బయట), 2017లో న్యూజిలాండ్ (సొంతగడ్డపై), ఇంగ్లాండ్ (సొంతగడ్డపై), ఆస్ట్రేలియా (సొంతగడ్డపై), బంగ్లాదేశ్ (సొంతగడ్డపై), శ్రీలంక (బయట) కోహ్లీ వరుస సిరిస్లను గెలిచాడు.
కోహ్లీపై మాజీల ప్రశంసల వర్షం
ఈ నేపథ్యంలో విరాట్ కోహ్లీపై పలువురు మాజీ క్రికెటర్లు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. ఈ సందర్భంగా గంగూలీ మాట్లాడుతూ 'కోహ్లీ గెలిచిన సిరీస్ల్లో ఎక్కువ శాతం సొంతగడ్డపైనే ఆడారు. విదేశాల్లో జరిగే సిరీసుల్లో విజయం సాధిస్తేనే మన సత్తా తెలుస్తోంది. త్వరలో కోహ్లీసేన దక్షిణాఫ్రికా పర్యటనకు వెళ్తోంది. అక్కడ సిరీస్ గెలిస్తే కోహ్లీ గొప్ప కెప్టెన్ అనడంలో ఎలాంటి సందేహం లేదు' అని అన్నాడు.
విదేశాల్లో కూడా కోహ్లీ సత్తా చాటాలి
'అక్కడ కూడా కోహ్లీ సత్తా చాటుతాడని అనుకుంటున్నా. కోహ్లీ మంచి క్రికెటర్ మాత్రమే కాదు మంచి నాయకుడు కూడా. అతడి కెప్టెన్సీలో టీమిండియా గొప్ప గొప్ప విజయాలను సాధిస్తోంది. దక్షిణాఫ్రికా, ఇంగ్లాండ్, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్పై ఆయా దేశాల్లో సిరీస్లు గెలవాలి. అప్పుడే కోహ్లీ సామర్థ్యాలను అంచనా వేయగలం' అని దాదా అన్నాడు.