|
లోయర్ ఆర్డర్లో మార్పులకు ఆస్కారం లేదు
"వారు చేస్తున్న పనిపై విశ్వాసం పెంచుకోవాలని కోరుకుంటున్నాం. లోయర్ ఆర్డర్లో మార్పులకు ఆస్కారం లేదు. రిషబ్ పంత్కు కొత్త అయినప్పటికీ అశ్విన్, జడేజా చాలా మ్యాచుల్లో మంచి ప్రదర్శన చేశారు. విదేశాల్లోనూ అలాగే ఆడితే చాలు. ఈ సిరిస్తో టాపార్డర్ కుదురుకుంటే చాలు. ఈ రెండు టెస్టుల్లో ఇబ్బంది పడాల్సిన అంశాలు ఏమీ లేవు" అని చెప్పాడు.
|
తుది జట్టును మార్పుని సమర్ధించుకున్న కోహ్లీ
ప్రతి మ్యాచ్కు తుది జట్టులో పదకొండు మందిని మార్పు చేసే అలవాటును విరాట్ కోహ్లీ సమర్థించుకున్నాడు. అత్యుత్తమ జట్టును ఎంపిక చేయాలన్నదే తమ ఉద్దేశమని కోహ్లీ పేర్కొన్నాడు. పరిస్థితులు, ఫామ్ను అనుసరించి జట్టును ఎంపిక చేస్తామని కోహ్లీ తెలిపాడు. అలా చేయడం వల్లనే బౌలర్లు విదేశాల్లో 20 వికెట్లు తీయగలుతున్నారని కోహ్లీ తెలిపాడు.
|
ఇంగ్లీషు గడ్డపై ఓటమికి కారణం చెప్పిన కోహ్లీ
విదేశీ పర్యటనల్లో స్థాయికి తగిన బ్యాటింగ్ చేయని కారణంగానే ఇంగ్లాండ్లో ఓటమి పాలయ్యామని కోహ్లీ పేర్కొన్నాడు. మ్యాచ్ గెలుపులో లోయర్ ఆర్డర్ పరుగులు చాలా కీలకమని కోహ్లీ అన్నాడు. ఐదు టెస్టుల సిరిస్లో ఇంగ్లాండ్ అదే చేసిందని ఈ సందర్భంగా కోహ్లీ పేర్కొన్నాడు. విండిస్తో సిరీస్ను తాము బెంచ్మార్క్గా తీసుకున్నామని కోహ్లీ అన్నాడు.
ఆసియాకప్ నుంచి విశ్రాంతిపై ఇలా
ఆసియాకప్ నుంచి విశ్రాంతి తీసుకోవడంపై కోహ్లీ ఈ సందర్భంగా స్పందించాడు. "మానసికంగా, శారీరకంగా నేను ఉత్తేజితుడినయ్యా. దక్షిణాఫ్రికా, ఇంగ్లాండ్ సిరీసుల్లో తీవ్రంగా పోటీపడి అలసిపోవడంతో విశ్రాంతి అవసరమైంది. అందరూ పనిభారం గురించి మాట్లాడతారే తప్ప ఆ విధానాన్ని అర్థం చేసుకోరు" అని కోహ్లీ అన్నాడు.
ఆరు గంటలు బ్యాటింగ్ చేస్తే భారంగా ఉన్నట్టు
"ఎక్కువ మ్యాచ్లు ఆడటమే పనిభారంగా భావిస్తారు. ప్రతి మ్యాచ్లో ఏమీ చేయకుండా ఖాళీగా ఉంటే పనిభారం ఉండదు. అదే నేను ఆరు గంటలు బ్యాటింగ్ చేస్తే భారంగా ఉన్నట్టు. 2019 వరల్డ్ కప్ నేపథ్యంలో ఇలాంటి విశ్రాంతి ఆటగాళ్లకు అవసరమే. విశ్రాంతి తీసుకోవడం వల్లే ఉత్తేజితులవుతారు" అని విరాట్ కోహ్లీ అన్నాడు.