నాటింగ్హామ్: టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ ఖాతాలో మరో రికార్డు వచ్చి చేరింది. సౌతాంప్టన్లో ఇంగ్లండ్తో జరుగుతున్న నాలుగో టెస్టులో భారత జట్టు ఎటువంటి మార్పులు లేకుండానే బరిలోకి దిగింది. గాయంతో బాధపడుతున్న టాప్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ నాలుగో టెస్టుకు దూరమవుతాడని తొలుత భావించినా, కోలుకోవడంతో తుది జట్టులో స్థానం కల్పించారు. దీంతో మూడో టెస్టులో ఆడిన జట్టే యథాతథంగా నాలుగో టెస్టులో బరిలోకి దిగింది.
ఇప్పటి వరకు ఓ టెస్టు మ్యాచ్లో ఆడిన జట్టు తర్వాతి మ్యాచ్లో యథాతథంగా ఆడలేదు. కనీసం ఒక్క మార్పుతోనైనా బరిలోకి దిగేది. కానీ ఈసారి మాత్రం ఒక్క మార్పూ లేకుండానే బరిలోకి దిగింది. కెప్టెన్ కోహ్లీ కెప్టెన్సీలో భారత జట్టు ఇప్పటి వరకు 38 టెస్టులో ఆడింది. ఇందులో ఒక్కసారి ఆడిన జట్టు మరోసారి బరిలోకి దిగలేదు. తుది జట్టులో ఒక్క మార్పు అయినా జరిగేది.
కానీ, ఈసారే ఒక్క మార్పు కూడా లేకుండా ఆడుతోంది. విషయం తెలిసిన క్రీడాభిమానులు కూడా ఆశ్చర్యానికి గురవుతున్నారు. 38 టెస్టులకు కెప్టెన్సీ వహించిన కోహ్లీ 22 టెస్టుల్లో విజయం సాధించగా, ఏడింటిలో ఓడింది. 9 టెస్టులు డ్రా అయ్యాయి.
ఇంగ్లాండ్తో జరుగుతున్న నాలుగో టెస్టులో టీమిండియా బౌలర్లు జోరుమీదున్నారు. 30 పరుగుల్లోపే మూడు వికెట్లు తీశారు. భారత్కు శుభారంభం అందించారు. తాజాగా ఇంగ్లాండ్ మూడో వికెట్ చేజార్చుకుంది. ఇన్నింగ్స్ 12.6వ బంతికి బెయిర్స్టో 16 బంతుల్లో(6))ను జస్ప్రీత్ బుమ్రా ఔట్ చేశాడు. బ్యాట్ అంచుకు తాకిన బంతిని కీపర్ రిషబ్ పంత్ ఒడిసిపట్టాడు. 14 ఓవర్లు ముగిసే సరికి ఇంగ్లాండ్ 29/3తో నిలిచింది. ఓపెనర్ అలిస్టర్ కుక్ 47 బంతుల్లో 3 ఫోర్లతో (17) నిలకడగా ఆడుతున్నాడు. బెన్స్టోక్స్ క్రీజులోకి వచ్చాడు.