జట్టును ప్రేరణతో నడిపించేందుకు ధోనీ:
మరో రెండు రోజుల్లో ఆసియా కప్ మొదలుకానుండగా.. కెప్టెన్ కోహ్లీ లేకపోయినా జట్టును నడిపించేందుకు ప్రేరణనందించేందుకు మహేంద్ర సింగ్ ధోనీ ఉన్నాడనే విషయాన్ని గుర్తు చేశాడు. ‘విరాట్ లేకపోవడం జట్టుకు పెద్ద లోటే. అయితే ట్రోఫీ గెలిపించగల నాణ్యమైన ఆటగాళ్లు జట్టులో ఉన్నారు. అందరివాడు ఎంఎస్ ధోనీ జట్టుకు ఇంతకు ముందు నాయకత్వం వహించాడు. అందరికీ అండగా ఉంటాడు. ఈ సీజన్లో రాణించేందుకు అతడే నాకు సాయం చేశాడు' అని రాయుడు అన్నాడు.
ఈసారి ఐపీఎల్ బాగా ఆడా.
'నిజం చెప్పాలంటే మిడిలార్డర్ గురించి ఆలోచించడం లేదు. ఇది నాలోని ఆటను ప్రదర్శించేందుకు దొరికిన అవకాశం. మిడిలార్డర్ గురించి ఆలోచిస్తూ అనవసర ఒత్తిడి పెంచుకోలేను. ప్రస్తుతం జట్టులో ఎవరూ ప్రపంచ కప్ గురించి ఆలోచిస్తున్నారని అనుకోను. ఇప్పుడు మేం ఆసియాకప్ ఆడుతున్నాం. ఇంగ్లాండ్తో పరిమిత ఓవర్ల సిరీస్కు దూరమవ్వడం చిరాకు పెట్టించినా.. తిరిగి ఆసియాకప్కు ఎంపికవ్వడం సంతోషానిచ్చింది. ఈసారి ఐపీఎల్ బాగా ఆడా. కీలకమైన అంశం ఏంటంటే వయసుతో సంబంధం లేదు. ఫిట్గా ఉంటే చాలు' అని అంబటి పేర్కొన్నాడు.
మిడిలార్డర్ కోసం చాన్నాళ్లుగా ప్రయోగాలు
ప్రపంచకప్ను దృష్టిలో ఉంచుకొని టీమిండియా మిడిలార్డర్ బ్యాట్స్మెన్ కోసం చాన్నాళ్లుగా ప్రయోగాలు చేస్తోంది. ఇప్పటికీ కూర్పు పరంగా స్థిరపడలేదు. ఈ నేపథ్యంలో అంబటి రాయుడు మిడిలార్డర్లో తన స్థానం పదిలపరుచుకొనే అవకాశాలు ఉన్నాయి. ‘
ధోని ఏ స్థానంలో బ్యాటింగ్కు రావాలనే
కోహ్లీకి విశ్రాంతి నేపథ్యంలో మిడిలార్డర్ బలాన్ని అంచనావేయాలని టీమ్ మేనేజ్మెంట్ భావిస్తోంది. అంబటి రాయుడు, కేఎల్ రాహుల్, మనీష్ పాండే సామర్థ్యంపై ఒక అంచనాకు రానుంది. సీనియర్ ఆటగాడు మాజీ కెప్టెన్ ధోని ఏ స్థానంలో బ్యాటింగ్కు రావాలన్న విషయమూ ఈ టోర్నీ ద్వారా స్పష్టమవుతుంది.