ఛాంపియన్స్ ట్రోఫీ 2025లో భాగంగా ఆడిన తన తొలి మ్యాచ్లోనే అద్భుతమైన బౌలింగ్తో ఆకట్టుకుంది టీమిండియా. కానీ ఫీల్డింగ్ లో మాత్రం నిరాశపరిచింది. ఇదే సమయంలో టీమిండియా స్టార్ వికెట్ కీపర్ కేఎల్ రాహుల్ చేసిన ఓ తప్పిదం వల్ల విరాట్ కోహ్లీ తీవ్ర ఆగ్రహానికి గురయ్యాడు. అసహనానికి గురైన అతడు ఫ్రస్టేషన్ లో మైదానంలోనే గట్టిగా అరుస్తూ కనిపించాడు. ప్రస్తుతం దీనికి సంబంధించిన ఫొటోలు, వీడియోలు వైరల్ గా మారాయి.
సులభమైన క్యాచులు మిస్..
ఈ మ్యాచ్ లో రోహిత్ శర్మ, హార్దిక్ పాండ్య సులభమైన క్యాచ్ లను వదిలేశారు. రోహిత్, జాకీర్ అలీ ఇచ్చిన ఈజీ క్యాచ్ను జారవిడిచగా.. తౌహీద్ హృదయ్ క్యాచ్ను హార్దిక్ మిస్ చేశాడు. దీంతో ఈ ఇద్దరు దొరికిందే అవకాశం అన్నట్టుగా దూకుడు కొనసాగిస్తూ చెలరేగి ఆడారు. అయితే ఆ తర్వాత కూడా మరోసారి జాకీర్ అలీని ఔట్ చేసే అవకాశం రాగా దాన్నికేఎల్ రాహుల్ వదులుకున్నాడు.

రాహుల్ పై కోహ్లీ ఫైర్...
23వ ఓవర్లో జాకీర్ అలీకి.. తనను ఔట్ చేసే అవకాశం కేఎల్ రాహుల్ కు కూడా ఇచ్చాడు. అయితే రాహుల్ మాత్రం.. జాకీర్ అలీని ఈజీగా స్టంపింగ్ చేసే అవకాశాన్ని చేజార్చుకున్నాడు. రవీంద్ర జడేజా బౌలింగ్ లో ఇది జరిగింది. దీంతో అప్పటికే ఫుల్ ఫామ్ లో ఉన్న జాకీర్ అలీ తన ధనాధన్ ఇన్నింగ్స్ ను కొనసాగించాడు. ఈ క్రమంలోనే రాహుల్ తప్పిదానికి విరాట్ కోహ్లీ అసహనానికి గురయ్యాడు. ఫ్రస్టేషన్ లో అరుస్తూ కనిపించాడు.
— Drizzyat12Kennyat8 (@45kennyat7PM) February 20, 2025