విధి నిర్వహణలో అమరులైన
విధి నిర్వహణలో అమరులైన 10 మంది పారా మిలటరీ అమర జవానుల కుటుంబాలకు రూ.1లక్ష చొప్పున చెల్లించాలని, మిగిలిన రూ.10 లక్షలు అంధుల క్రికెట్ అసోసియేషన్ ప్రచారఖర్చుల నిమిత్తం విరాళంగా ఇవ్వాలని సూచించారు. ఈ మొత్తాన్ని నిర్దేశించిన నాలుగు వారాల్లోపు చెల్లించాలని అన్నారు.

జరిమానా చెల్లించకుంటే
ఒకవేళ జరిమానా చెల్లించకుంటే వీరికి ఇచ్చే మ్యాచ్ ఫీజులోంచి బీసీసీఐ తీసుకోవాలని అంబుడ్స్మన్ ఆదేశించారు. మహిళలపై అనుచిత వ్యాఖ్యలు చేసినందుకు గాను ఆస్ట్రేలియా పర్యటన నుంచి అర్ధంతరంగా వచ్చేసిన కారణంగా ఇప్పటికే ఈ ఇద్దరూ రూ.30 లక్షల చోప్పున ఆదాయం కోల్పోయారని ఆయన అన్నారు.

దేశానికి ప్రాతినిథ్యం వహిస్తోన్న వీరు
దేశానికి ప్రాతినిథ్యం వహిస్తోన్న వీరు రోల్ మోడల్స్గా ఉండాలని, వారి ప్రవర్తన ఆదర్శవంతంగా ఉండాలని ఆయన పేర్కొన్నారు. అయితే, ఇద్దరూ ఇలాంటి వ్యాఖ్యలు చేయడం బాధాకరమన్న ఆయన... వారు చేసిన వ్యాఖ్యలకు క్షమాపణలు చెప్పాలని బీసీసీఐ అంబుడ్సమన్ డీకే జైన్ ఆదేశించారు.


Click it and Unblock the Notifications
