హైదరాబాద్: ఛాంపియన్స్ ట్రోఫీ... వరల్డ్ కప్కు ఏ మాత్రం తీసిపోని అద్భుతమైన టోర్నీ. ఈ టోర్నీలో టాప్ 8 దేశాలు పాల్గొంటాయి. జూన్ 1 జరిగే ఈ టోర్నీకి ఇంగ్లాండ్ ఆతిథ్యమిస్తోంది. ఎనిమిది జట్లు రెండు గ్రూపులుగా విడిపోయి ఈ టోర్నీలో పాల్గొంటున్నాయి.
ఆతిథ్య ఇంగ్లాండ్తో పాటు బంగ్లాదేశ్, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ గ్రూప్ ఎ నుంచి పోటీ పడుతుండగా భారత్, పాకిస్థాన్, శ్రీలంక, దక్షిణాఫ్రికా గ్రూప్ బి నుంచి ఢీకొంటున్నాయి. 2013లో జరిగిన ఛాంపియన్స్ ట్రోఫీలో ఇంగ్లాండ్ను ఫైనల్లో ఓడించిన భారత్ డిఫెండింగ్ ఛాంపియన్గా బరిలోకి దిగుతుంది.
ఈ టోర్నీలో భారత్ చిరకాల ప్రత్యర్థి పాకిస్థాన్తో జూన్ 4వ తేదీన మ్యాచ్ ఆడనుంది. ఇదిలా ఉంటే టీమిండియా వెటరన్ క్రికెటర్ యువరాజ్ సింగ్కు ఇది ఐదో ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ కావడం విశేషం.
2000 ✅
— ICC (@ICC) May 8, 2017
2002 ✅
2004 ✅
2006 ✅
Press ❤️ if you can't wait to see @YUVSTRONG12 in his 5th ICC Champions Trophy at #CT17! 🇮🇳 pic.twitter.com/6XtfgstcGX
ఇదిలా ఉంటే జూన్ 23, 2013లో జరిగిన ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్ మ్యాచ్ని వర్షం కారణంగా 20 ఓవర్లకి కుదించారు. ఈ మ్యాచ్లో విరాట్ కోహ్లీ (34 బంతుల్లో 43), రవీంద్ర జడేజా (25 బంతుల్లో 33) నిలకడగా ఆడటంతో తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 129 పరుగులు చేసింది.
అనంతరం 130 పరుగుల విజయ లక్ష్యంతో బరిలోకి దిగిన ఇంగ్లాండ్ మోర్గాన్ (30 బంతుల్లో 33), రవి బొపారా (25 బంతుల్లో 30) దూకుడుగా ఆడటంతో ఇంగ్లాండ్ 17.2 ఓవర్లు ముగిసే సమయానికి 4 వికెట్లు కోల్పోయి 110 పరుగులు చేయడంతో అలవోకగా గెలిచేలా కనిపించింది.
Who thinks we'll see a repeat of this at the #CT17 final on 18 June?! 🇮🇳 pic.twitter.com/jY7tTWJcUM
— ICC (@ICC) May 8, 2017
ఈ సమయంలో వరుస బంతుల్లో మోర్గాన్, రవి బొపారాని అవుట్ చేసి పేసర్ ఇషాంత్ శర్మ మ్యాచ్ని భారత్వైపు తిప్పాడు. చివరికి ఆ జట్టు 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 124 పరుగులు చేసింది. దీంతో ఛాంపియన్స్ ట్రోఫీని భారత్ కైవసం చేసుకుంది. మ్యాచ్ అనంతరం కోహ్లీ, జడేజా, రోహిత్ శర్మ, శిఖర్ ధావన్ తదితరులు గంగ్నమ్ డ్యాన్స్లతో అదరగొట్టారు.