2019 ప్రపంచ కప్ కోసం భారత్ ఇప్పటి నుంచే టీమ్ ను సెలెక్ట్ చేసే పనిలో పడింది. అయితే ఇప్పటికే ఇండియా కు రోహిత్ శర్మ , శిఖర్ ధావన్ రూపంలో గట్టి ఓపెనర్స్ ఉన్నారు. ఇక అల్ రౌండర్ కోటా లో పాండ్యా థ్ తోపాటు ఇప్పుడు విజయ శంకర్ రూపంలో ఇండియా కు మరో అల్ రౌండర్ దొరికాడు. సెలెక్టర్లు కు టీం ను సెలెక్ట్ చేయడం అంత సులభతర వ్యవహారం కాదనే చెప్పాలి.
ఎమ్మెస్కె ప్రసాద్ మాట్లాడుతూ , '' ప్రపంచ కప్ కు కేఎల్ రాహుల్ ఫామ్ ముఖ్యమని , ప్రపంచ ఇప్పటికే ఇండియా కు మంచి ఓపెనర్స్ ఉన్నా ప్రపంచ కప్ లాంటి ఈవెంట్ కు థర్డ్ ఓపెనర్ లేకపోతే ఇబ్బందే నని " చెప్పుకొచ్చాడు. కేఎల్ రాహుల్ వివాదం తరువాత ఆస్ట్రేలియా సిరీస్ కు ఎంపికైన సంగతి తెల్సిందే . అయితే కేఎల్ రాహుల్ ఫామ్ చాలా ముఖ్యమని ఈ సెలక్షన్ ద్వారా ఎమ్మెస్కె చెప్పకనే చెప్పాడు.
అయితే మాజీ క్రికెటర్ , వ్యాఖ్యాత అయినటువంటి సునీల్ గవాస్కర్ మాట్లాడుతూ కేఎల్ రాహుల్ లేని పక్షం లో ఆ స్థానానికి దినేష్ కార్తీక్ చక్కగా సరిపోతాడని చెప్పుకొచ్చాడు. న్యూజిలాండ్ - భారత్ కు జరిగిన మ్యాచ్ ల్లో దినేష్ కార్తీక్ తన బ్యాటింగ్గా తో ఫర్వాలేదని పించాడు. అయితే ఎవరు ఊహించని విధంగా దినేష్ కార్తీక్ ఆస్ట్రేలియా సిరీస్ కు ఎంపికయ్యాడు.