న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

IPL 2020: కింగ్స్ ఎలెవన్ పంజాబ్ కెప్టెన్‌గా కేఎల్ రాహుల్

KL Rahul appointed Kings XI Punjab captain for IPL 2020

హైదరాబాద్: వచ్చే ఐపీఎల్ సీజన్‌కు కింగ్స్ ఎలెవన్ పంజాబ్ జట్టు కెప్టెన్‌గా కేఎల్‌ రాహుల్‌ను నియమించింది. ఈ మేరకు పంజాబ్ సహా యజమాని నెస్‌వాడియా అధికారిక ప్రకటన చేశారు. అతడిలో మంచి బ్యాట్స్‌మెన్‌ను మాత్రమే కాకుండా అద్భుతమైన కెప్టెన్‌ను కూడా చూస్తారని నెస్‌వాడియా బుధవారం తెలిపాడు.

<strong>ముగిసిన ఐపీఎల్ 2020 వేలం: అండర్-19 ఆటగాళ్లకు కోట్లు, అత్యధిక ధర పలికిన ఆటగాళ్లు వీరే!</strong>ముగిసిన ఐపీఎల్ 2020 వేలం: అండర్-19 ఆటగాళ్లకు కోట్లు, అత్యధిక ధర పలికిన ఆటగాళ్లు వీరే!

ఐపీఎల్ వేలం సందర్భంగా

ఐపీఎల్ వేలం సందర్భంగా

కోల్‌కతాలో ఐపీఎల్ వేలం సందర్భంగా పంజాబ్ సహా యజమాని నెస్ వాడియా మాట్లాడుతూ రాహుల్‌ను కెప్టెన్‌గా నియమించడం పట్ల సంతోషం వ్యక్తం చేశారు. "రాబోయే సీజన్‌కు రాహుల్‌ను మా కెప్టెన్‌గా నియమించడం మాకు సంతోషంగా ఉంది. అతను గతేడాది అద్భుత ప్రదర్శన చేశాడు. ఈ క్రమంలో 2020 ఐపీఎల్లో కెప్టెన్‌గా రానున్నాడు" అని చెప్పాడు.

బ్యాట్స్‌మన్‌గానే కాకుండా కెప్టెన్‌గానూ

తన బ్యాటింగ్‌తో విమర్శకుల నోర్లు మూయించాడని, బ్యాట్స్‌మన్‌గానే కాకుండా కెప్టెన్‌గానూ అతడు రాణిస్తాడని చెప్పుకొచ్చాడు. మరోవైపు పంజాబ్ జట్టుకు హెడ్ కోచ్‌గా ఉన్న అనిల్ కుంబ్లే సైతం యువ ఆటగాళ్లకే ప్రాధాన్యమిచ్చి వచ్చే సీజన్‌లో మంచి ఫలితాలు రాబట్టాలని పట్టుదలతో ఉన్నాడు. ఐపీఎల్‌లో పంజాబ్ ఇప్పటివరకు ఒక్క టైటిల్ కూడా నెగ్గలేదు.

వచ్చే ఐపీఎల్ సీజన్‌లో పంజాబ్‌ ఆటగాళ్లు

వచ్చే ఐపీఎల్ సీజన్‌లో పంజాబ్‌ ఆటగాళ్లు

కేఎల్‌ రాహుల్‌(కెప్టెన్‌), క్రిస్‌ గేల్‌, మయాంక్‌ అగర్వాల్‌, కరన్‌ నైర్‌, మన్‌దీప్‌ సింగ్‌, నికోలస్‌ పూరన్‌, సర్ఫరాజ్‌ ఖాన్‌, మురుగన్‌ అశ్విన్‌, ముజీబ్‌ ఉర్‌ రహ్మాన్‌, గౌతమ్‌, సుచిత్‌, హర్‌ప్రీత్‌ బ్రార్‌, మోహ్మద్‌ షమి, హార్దర్‌ విల్‌జోన్‌, అర్షీద్‌ సింగ్‌, దర్శన్‌ నల్కండే.

వేలంలో కొనుగోలు చేసిన ఆటగాళ్లు వీరే!

గ్లెన్‌మాక్స్‌వెల్‌(రూ. 10.75 కోట్లు), షెల్డన్‌ కాట్రెల్‌(రూ. 8.50 కోట్లు), దీపక్‌ హూడా(రూ. 50 లక్షలు), ఇషాన్‌ పోరెల్‌(రూ. 20లక్షలు), రవి బిష్ణోయి(రూ. 2 కోట్లు), జిమ్మీ నీషమ్‌(రూ. 50 లక్షలు), క్రిస్‌ జోర్డాన్‌(రూ. 3 కోట్లు), తాజిందర్‌ సింగ్‌(రూ. 20 లక్షలు), ప్రభ్‌ సిమ్రన్‌(రూ. 55లక్షలు)

Story first published: Friday, December 20, 2019, 12:47 [IST]
Other articles published on Dec 20, 2019
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X