
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) సీజన్-12లో కోల్కతా నైట్రైడర్స్ వరుసగా రెండోసారి ఢిల్లీ క్యాపిటల్స్ చేతిలో ఓడిపోయింది. ఢిల్లీ వేదికగా కోల్కతా, ఢిల్లీ జట్ల మధ్య జరిగిన మ్యాచ్లో.. మ్యాచ్ టై అయినా సూపర్ ఓవర్లో ఢిల్లీ విజయం సాధించింది. ఇక మొహాలీ వేదికగా జరిగిన మ్యాచ్లో ఢిల్లీ 7 వికెట్ల తేడాతో గెలిచింది. ఈ ఓటమిపై కోల్కతా జట్టు యజమాని షారుక్ ఖాన్ ట్వీట్ చేశాడు.
'శుభ్మన్ గిల్, ఆండ్రీ రసెల్ మరోసారి బాగా ఆడారు. ఓటమి ఫర్వాలేదు.. కానీ మా ఆట బాగాలేదు. మా బౌలింగ్ బాగా నిరాశపరిచింది. అయితే ఈడెన్లో మా దాదా (గంగూలీ) గెలుపొందిన జట్టువైపు ఉండటం సానుకూల అంశం. విజయం సాధించిన ఢిల్లీకి అభినందనలు' అని షారుక్ ఖాన్ ట్వీట్ చేశాడు.
శుక్రవారం జరిగిన మ్యాచ్లో ముందుగా బ్యాటింగ్ చేసిన కోల్కతా నిర్ణీత 20 ఓవర్లలో 178 పరుగులు చేసింది. ఓపెనర్ శుభ్మన్ గిల్ 65( 39 బంతుల్లో; 4x7, 2x6).. స్టార్ ఆటగాడు ఆండ్రీ రసెల్ 45 (21 బంతుల్లో; 4x3, 4x6 ) పరుగులు చేశారు. లక్ష ఛేదనలో ఢిల్లీ 18.5 ఓవర్లలో మూడు వికెట్ల నష్టానికి 180 పరుగులు చేసి గెలుపొందింది. ఓపెనర్ శిఖర్ ధావన్ 97 (63 బంతుల్లో; 4x11, 2x6) పరుగులతో అజేయంగా నిలిచాడు. రిషభ్ పంత్ కూడా 46 పరుగులతో చెలరేగాడు.