
ఇండియా ఎప్పటికీ ప్రత్యేకమే
ఇక ట్విట్టర్ ద్వారా ట్వీట్ చేసిన కెవిన్ పీటర్సన్.. 'తిరిగి ఇంటికెళ్తున్నా. ఇండియాకు మరోసారి ధన్యవాదాలు. భారతదేశం తనకు ఎప్పటికీ స్పెషల్' అని ట్వీట్లో పేర్కొన్నాడు. ప్లేయర్గా కెవిన్ పీటర్సన్ గతంలో ఐపీఎల్లో ఆడాడు. ఐపీఎల్లో ఐదు ఎడిషన్లలో వివిధ జట్ల తరఫున కెవిన్ పీటర్సన్ పాల్గొన్నాడు. ఐపీఎల్ 2009లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు తరఫున టోర్నీలో అరంగేట్రం చేసిన కెవిన్.. తర్వాత ఢిల్లీ క్యాపిటల్స్ (అప్పటి ఢిల్లీ డేర్ డెవిల్స్), రైజింగ్ పూణే సూపర్ జెయింట్స్ (RPSG) తరఫున కూడా ఆడాడు. ఐపీఎల్లో 2016 సీజన్లో అతను తన చివరి మ్యాచ్ ఆడాడు. ఇక పీటర్సన్ మొత్తం 36 ఐపీఎల్ మ్యాచ్లు ఆడి 1001పరుగులు చేయడంతో పాటు బౌలింగ్లో ఏడు వికెట్లు కూడా తీశాడు.

అంతర్జాతీయ క్రికెట్లో..
కెవిన్ పీటర్సన్ అంతర్జాతీయ క్రికెట్లో ఇంగ్లాండ్ తరఫున 104టెస్టులు ఆడాడు. అలాగే 136 వన్డేలు ఆడాడు. టెస్టుల్లో 8181పరుగులు చేసిన కెవిన్, వన్డేల్లో 4440పరుగులు చేశాడు. ఇక టీ20 ఫార్మాట్లో 37మ్యాచ్లు ఆడిన కెవిన్ 37.94సగటుతో మొత్తం 1176పరుగులు చేశాడు. ఏడు హాఫ్ సెంచరీలు కూడా చేశాడు.

ఐపీఎల్లో నేడు
ఐపీఎల్లో నేడు మరో రసవత్తర పోరుకు రంగం సిద్ధమైంది. ఐదుసార్లు ఐపీఎల్ ఛాంపియన్ అయిన ముంబై ఇండియన్స్ (MI) 56వ మ్యాచ్లో కోల్కతా నైట్ రైడర్స్తో తలపడనుంది. ఈ మ్యాచ్ ముంబైలోని డీవై పాటిల్ స్పోర్ట్స్ అకాడమీ మైదానంలో జరగనుంది. ఇక ఈ రెండు జట్లూ పాయింట్ల పట్టికలో అట్టడుగు స్థానాల్లో ఉన్నాయి. కోల్ కతా 8వ స్థానంలో ఉండగా.. ముంబై చివరగా 10వ స్థానంలో ఉంది. ఇక ముంబై గెలిచినా గెలవకున్నా పోయేదేం లేదు కానీ.. కోల్ కతా ఓడిపోతే మాత్రం ప్లేఆఫ్ రేసు నుంచి పూర్తిగా తప్పుకున్నట్లు అవుతుంది.


Click it and Unblock the Notifications











