న్యూ ఢిల్లీ: ఆసియాకప్లో భాగంగా భారత్తో జరుగుతున్న ఫైనల్ మ్యాచ్లో బంగ్లాదేశ్ ఓపెనర్లు ధాటిగా ఆడారు. 20 ఓవర్లు పూర్తయ్యేవరకూ జట్టుకు ఒక్క వికెట్ నష్టం వాటిల్లకుండా జాగ్రత్తగా భాగస్వామ్యాన్ని కొనసాగించారు. కానీ, 20.5 ఓవర్లో కేదర్ జాదవ్ బౌలింగ్కు ఒక వికెట్ దక్కింది. మెహదీ హసన్59 బంతుల్లో (32) షాట్ ఆడే ప్రయత్నంలో అంబటి రాయుడు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు.
20 ఓవర్లు పూర్తయ్యే వరకూ భారత బౌలర్ల సహనానికి పరీక్షగా నిలిచారు బంగ్లా ఓపెనర్లు. ఈ క్రమంలో 33 బంతుల్లో 6 ఫోర్లు, రెండు సిక్స్లతో హాఫ్ సెంచరీ పూర్తి చేశాడు. దీంతో పవర్ప్లే ముగిసే సరికి బంగ్లా వికెట్ నష్టపోకుండా 65 పరుగులు చేసింది.
మరో ఓపెనర్ లిటన్ దాస్ ధాటిగా ఆడుతూ.. సెంచరీకి దగ్గరయ్యే ప్రయత్నంలో ఉన్నాడు. అతనికి తోడుగా క్రీజులోకి దిగిన ఇమ్రుల్ కయేస్ కలిసి ఆడుతున్నారు.
టాస్ ఓడి బ్యాటింగ్కు దిగిన బంగ్లాకు ఓపెనర్స్ మంచి శుభారంభం అందించారు. గత మ్యాచ్ల్లో విఫలమైన ఓపెనర్స్ ఈ మ్యాచ్లో మెరిసారు. దీంతో 24 ఓవర్లు పూర్తయ్యేసరికి బంగ్లాదేశ్ స్కోర్ , క్రీజులో లిటోన్ దాస్(91), ఇమ్రుల్ కయేస్(2) ఉన్నారు.
ఇండియా జట్టు:
Rohit Sharma (c), Shikhar Dhawan, Ambati Rayudu, Dinesh Karthik, MS Dhoni (wk), Kedar Jadhav, Ravindra Jadeja, Bhuvneshwar Kumar, Yuzvendra Chahal, Kuldeep Yadav, Jasprit Bumrah
బంగ్లాదేశ్ జట్టు:
Liton Das, Soumya Sarkar, Mushfiqur Rahim (wk), Mohammad Mithun, Imrul Kayes, Mahmudullah, Mehedi Hasan, Mashrafe Mortaza (c), Nazmul Islam, Rubel Hossain, Mustafizur Rahman