ఐపీఎల్ సస్పెండ్తో
ఐపీఎల్ 2021 టోర్నమెంట్ అర్ధాంతరంగా వాయిదా పడటం కొన్ని ఫ్రాంఛైజీలను తీవ్ర నిరాశకు గురి చేయగా.. మరికొన్నింట్లో పుల్ జోష్ను నింపాయి. ఆ ఫ్రాంఛైజీలేమిటో అర్థం చేసుకోవడానికి బుర్రకు పెద్దగా పదును పెట్టాల్సిన పనీ లేదు. పాయింట్ల టేబుల్ చూసుకుంటే తెలిసిపోతుంది. టైటిల్ హాట్ ఫేవరెట్లుగా టోర్నమెంట్ను ఆరంభించిన జట్లన్నీ ఇప్పుడు తీవ్ర నిరాశలో ఉన్నాయి. చెన్నై సూపర్ కింగ్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, ఢిల్లీ కేపిటల్స్, ముంబై ఇండియన్స్ జట్లకు ఐపీఎల్ వాయిదా పడటం జీర్ణించుకోలేని అంశమే. ఈ నాలుగు జట్లూ ఇప్పటికే ప్లేఆఫ్ ముగింట్లో నిలిచాయి.
కోహ్లీ అండ్ టీమ్లో
ఈ సీజన్ ఎప్పుడు నిర్వహించాల్సి వచ్చినా.. ఆ పాయింట్ల టేబుల్ మారదు. ఎక్కడ అంతమైందో.. అక్కడి నుంచే ఆరంభమౌతుంది. అయినప్పటికీ- ఇప్పటి దూకుడును కొనసాగించడం కష్టతరమే. ఇప్పుడు పాయింట్ల పట్టికలో అట్టడుగున ఉన్న జట్లు పుంజుకోవడానికి ఈ బ్రేక్ ఉపయోగపడుతుందనడంలో సందేహాలు అక్కర్లేదు. అదే జరిగితే- పాయింట్ల టేబుల్ తలకిందలవుతుంది. ఈ సాలా కప్ నమ్దే అనే టాప్ గేర్లో దూసుకెళ్తోన్న రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు- ఈ పరిణామంతో దిగ్భ్రాంతికి గురవుతోంది. తమ దూకుడుకు సడన్ బ్రేక్ పడినట్టు ఈ జట్టు ఫ్రాంఛైజీ భావిస్తోంది.
కావ్యా మారన్ ఫుల్ ఖుష్
తాజా పరిణామాలతో సన్రైజర్స్ హైదరాబాద్ సీఈవో కావ్య మారన్ను ఫుల్ ఖుష్ అయినట్టే. ఐపీఎల్ 2021ను వాయిదా వేస్తున్నట్లు బీసీసీఐ తీసుకున్న నిర్ణయం హైదరాబాద్ ఫ్యాన్స్ను అంతులేని ఆనందానికి గురి చేస్తోంది. రాజస్థాన్ రాయల్స్, పంజాబ్ కింగ్స్, కోల్కతా నైట్రైడర్స్ ఫాన్స్ కూడా దాదాపు ఇదే పరిస్థితిలో ఉన్నారు. ఆడవాళ్లు ఏడిస్తే..రాజ్యాలే కుప్ప కూలిపోయాయని, ఆఫ్ట్రాల్ ఐపీఎల్ ఎంత అంటూ సంతోషిస్తున్నారు. కావ్య మారన్ కన్నీరు పెట్టడం వల్లే ఈ సీజన్ అర్ధాంతరంగా వాయిదా పడిందని అంటున్నారు. ఈ టోర్నమెంట్కు ఆమె ఉసురు తగిలిందంటూ కామెంట్స్ చేస్తున్నారు. మొత్తానికే రద్దు చేసి ఉంటే ఇంకా బాగుండేదని చెబుతున్నారు.
బ్రేక్.. గుడ్ ఛాన్స్..
పాయింట్ల టేబుల్లో సన్రైజర్స్ ప్రస్తుతం లాస్ట్ నుంచి ఫస్ట్లో ఉంటోంది. ఈ సీజన్లో ఏడు మ్యాచ్లను ఆడిన ఆ జట్టు గెలిచింది ఒక్క మ్యాచే. దాని ఖాతాలో ఉన్నవి రెండు పాయింట్లే. ఆరు మ్యాచ్ల్లో ఓడిపోవడం వల్ల ప్లేఆఫ్ అవకాశాలను సంక్లిష్టం చేసుకుంది. ప్లేఆఫ్లోకి ఎంట్రీ ఇవ్వాలీ అంటే ప్రతి మ్యాచ్ను గెలిచి తీరాల్సిన పరిస్థితిని హైదరాబాద్ ఎదుర్కొంటోంది. ఇప్పుడు తాజాగా వచ్చిన బ్రేక్.. ఆ జట్టు పుంజుకోవడానికి మంచి అవకాశమే. చేదు ఓటముల ద్వారా నేర్చుకున్న గుణపాఠాలతో తరువాత నిర్వహించే మిగిలిన మ్యాచుల్లో అద్భుతంగా ఆడుతుందని ఫ్యాన్స్ ప్రిడిక్ట్ చేస్తున్నారు.