
ఐదు మ్యాచ్లాడి ఒక్క వికెట్ కూడా తీయలేదు
2016లో సన్రైజర్స్ హైదరాబాద్ జట్టుకు కర్ణ్ శర్మ ప్రాతినిథ్యం వహించాడు. బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియం వేదికగా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో జరిగిన మ్యాచ్లో సన్రైజర్స్ హైదరాబాద్ 8 పరుగుల తేడాతో విజయం సాధించి తొలిసారి ఐపీఎల్ ట్రోఫీని కైవసం చేసుకుంది. ఆ సీజన్లో ఐదు మ్యాచ్లు ఆడిన శర్మకు ఒక్క వికెట్ కూడా తీయలేకపోయాడు.

రూ.5 కోట్లకు ముంబై ఇండియన్స్ సొంతం
ఆ తదుపరి ఏడాది సన్రైజర్స్ కర్ణ్ శర్మను వేలానికి వదిలేసింది. దీంతో 2017 ఐపీఎల్ కోసం నిర్వహించిన వేలంలో కర్ణ్ శర్మను రూ.5 కోట్లకు ముంబై ఇండియన్స్ సొంతం చేసుకుంది. ముంబై తరఫున 9 మ్యాచ్లాడిన శర్మ 13 వికెట్లను తన ఖాతాలో వేసుకున్నాడు. పూణెతో జరిగిన ఫైనల్లో ముంబై విజయం సాధించి మూడోసారి టైటిల్ని కైవసం చేసుకుంది. పూణెతో జరిగిన ఫైనల్లో కర్ణ్ శర్మ 18 పరుగులు ఇచ్చాడు.

6 మ్యాచ్లాడిన 4 వికెట్లు తీసిన కర్ణ్ శర్మ
ఆ తర్వాత 2018 సీజన్ కోసం బెంగళూరు వేదికగా నిర్వహించిన ఐపీఎల్ వేలంలో కర్ణ్ శర్మను చెన్నై సూపర్కింగ్స్ సొంతం చేసుకుంది. ఈ సీజన్లో మొత్తం 6 మ్యాచ్లాడిన కర్ణ్ శర్మ 4 వికెట్లు పడగొట్టాడు. ముంబైలోని వాంఖడె వేదికగా సన్రైజర్స్ హైదరాబాద్తో జరిగిన పైనల్లో కర్ణ్ శర్మ 3 ఓవర్లు వేసి ఒక వికెట్ తీశాడు. ఈ మ్యాచ్లో చెన్నై 8 వికెట్ల తేడాతో విజయం సాధించి ట్రోఫీని కైవసం చేసుకుంది.

ఏ ఆటగాడు అందుకోని అరుదైన ఘనత
దీంతో కర్ణ్ శర్మ ఇప్పటి వరకు ఐపీఎల్లో ఏ ఆటగాడు అందుకోని ఘనతను అందుకున్నాడు. వరుసగా మూడేళ్లు ట్రోఫీ గెలిచిన జట్టుకు ప్రాతినిధ్యం వహించిన ఆటగాడిగా అరుదైన రికార్డు నెలకొల్పాడు. ఇదిలా ఉంటే 11 సీజన్ల ఐపీఎల్ చరిత్రలో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, ఢిల్లీ డేర్డెవిల్స్, కింగ్స్ ఎలెవన్ పంజాబ్ జట్లు ఇప్పటి వరకు ఐపీఎల్ ట్రోఫీని గెలవక పోవడం విశేషం.


Click it and Unblock the Notifications












