
హైదరాబాద్: బాలీవుడ్ హీరో రణ్వీర్ సింగ్ బయోపిక్లో మాజీ ఆల్ రౌండర్ కపిల్దేవ్ నటిస్తున్నాడా? అంటే అవుననే అంటున్నారు సోషల్ మీడియాలో నెటిజన్లు. తాజాగా బోథమ్ చారిటి కార్యక్రమానికి వెళ్లిన కపిల్ దేవ్ వేషం చూసిన వాళ్లంతా ఇదే మాట అంటున్నారు. కపిల్ ఎరుపు రంగు టీ షర్ట్.. నీలం, తెలుపు, ఎరుపు రంగుల గీతలతో ఉన్న పాయింట్ ధరించి హాజరైయ్యాడు.
ఐసీసీ క్రికెట్ వరల్డ్కప్-2019 ప్రత్యేక వార్తల కోసం
ఈ విచిత్రమైన డ్రెస్ను చూసి అక్కడున్న వారంతా ఒక్కసారిగా అవాక్కయ్యారు. కపిల్ దేవ్ ఫొటోను నటుడు షరీబ్ హష్మి, క్రికెట్ వ్యాఖ్యాత హర్షా భోగ్లే ట్విటర్లో షేర్ చేయడంతో నెటిజన్లు జోకులు మీద జోకులు వేస్తున్నారు. రణ్వీర్ బయోపిక్లో నటించేందుకు కపిల్ సిద్దమయ్యారా? అంటూ ఓ నెటిజన్ కామెంట్ పెట్టాడు.
కపిల్, రణ్వీర్ ఒకరికొకరు పరస్పరం తమ పాత్రల్లో నటించనున్నారంటూ మరొక నెటిజన్ కామెంట్ చేశాడు. నిజానికి రణవీర్ సింగ్ చిత్రవిచిత్రమైన డ్రస్సులు ధరిస్తూ అభిమానులను అలరిస్తుంటాడు. అలాంటిది ఇప్పుడు కపిల్ దేవ్ కూడా గతానికి భిన్నంగా కనిపించడంతో అభిమానులు ఆశ్చర్యపోయారు.
కపిల్ నాయకత్వంలోని టీమిండియా 1983లో ప్రపంచకప్ సాధించిన సంగతి తెలిసిందే. దీంతో టీమిండియా తొలి ప్రపంచకప్ గెలిచిన మధుర క్షణాలను '1983' టైటిల్తో బాలీవుడ్ దర్శకుడు కబీర్ఖాన్ సినిమా తీస్తున్నారు. ఈ సినిమాలో కపిల్దేవ్ పాత్రలో రణ్వీర్సింగ్ నటిస్తున్నారు. జులై 6న ఈ సినిమా ఫస్ట్ లుక్ను విడుదల చేశారు. ఈ సినిమాను వచ్చే ఏడాది ఏప్రిల్లో విడుదల చేయాలని చూస్తున్నారు.