హైదరాబాద్: టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీకి, తనకి చాలా సారూప్యతలు ఉన్నాయని బాలీవుడ్ నటి కంగనా రనౌత్ తెలిపారు. మేమిద్దరం ఎక్కువ వివాదాలు ఎదుర్కొన్నామని, దీని ఫలితంగా ఎక్కువ అభిమానులను సంపాదించుకున్నామని 'పంగా' సినిమా ప్రమోషన్లో భాగంగా కంగనా రనౌత్ వెల్లడించింది.
ఈ సందర్భంగా కంగనా మాట్లాడుతూ "నాకు, కోహ్లీకి కొన్ని విషయాల్లో పోలికలు ఉన్నాయని చాలా మంది నాకు చెప్పారు. అతను వేరే నేపథ్యానికి చెందినవాడు. అతను తనకంటూ ఒక పేరు తెచ్చుకున్నాడు. అభిమానులను తన ప్రేమలో పడేలా చేశాడు" అని కోహ్లీ గురించి చెప్పుకొచ్చింది.
అసభ్య పదజాలంతో అభిమానిని దూషించిన బెన్ స్టోక్స్ (వీడియో)
"మా ఇద్దరి మధ్య ఒక పోలిక ఉంది. మేము ఇద్దరం ఎక్కువ వివాదాలు ఎదుర్కొన్నాం. దీంతో ఎక్కువ అభిమానులను సంపాదించాం. అంతేకాకుండా కోహ్లీకి దూకుడు ఎక్కువ అని విమర్శిస్తుంటారు. నేను కూడా ఎంతో దూకుడుగా ఉంటాను" అని కోహ్లీతో తనకున్న పోలికపై కంగనా తెలిపింది.
"క్రీడాకారుడి జీవితం సులభం కాదు. ఎన్నో కష్టాలు ఎదుర్కోవాల్సి ఉంటుంది. ఆట కోసం వారు తీవ్రంగా కృషి చేస్తారు. సరైన ఫిజిక్కు రావడంతో కోసం నిరంతం శ్రమిస్తారు. ఏ క్రీడాకారుడికైనా వ్యక్తిగతంగా ఇదొక సవాల్ మాదిరి ఉంటుంది" అని స్టార్ స్పోర్ట్స్ 'నెరొలాక్ క్రికెట్ లైవ్' కార్యక్రమంలో తన అభిప్రాయాన్ని చెప్పింది.
కివీస్ తీరంలో మరో సూపర్ స్టార్: అయ్యర్పై స్మిత్ ప్రశంసల వర్షం
ఇదిలా ఉంటే, జనవరి 24న విడుదలైన పంగా సినిమా ప్రస్తుతం బాక్సాఫీసు వద్ద మంచి వసూళ్లను రాబడుతోంది. ఈ సినిమాలో కంగనా జాతీయ స్థాయి కబడ్డీ క్రీడాకారిణిగా నటించింది. ఈ సినిమాకు దర్శకుడిగా అశ్వినీ అయ్యర్ తివారి పనిచేశారు. శంకర్ మహదేవన్, ఈషాన్ నూరానీ, లాయ్ మెడోస్నా సంగీతం అందించారు.