వరల్డ్ కప్లో అద్భుతమైన ఫామ్లో ఉన్న ప్లేయర్లలో విరాట్ కోహ్లీ ఒకడు. ఇటీవల న్యూజిల్యాండ్తో జరిగిన సెమీఫైనల్ మ్యాచులో చెలరేగిన అతను.. అద్భుతమైన సెంచరీతో ఆకట్టుకున్నాడు. ఈ క్రమంలోనే వన్డేల్లో 50 శతకాల రికార్డు సాధించి, సచిన్ టెండూల్కర్ పేరిట ఉన్న 49 సెంచరీల రికార్డు బద్దలు కొట్టాడు.
కోహ్లీ ఈ రికార్డు సాధించడంపై ప్రపంచం నలుమూలల నుంచి ప్రశంసల వర్షం కురిసింది. అందరూ ఈ గొప్ప ఫీట్ను తెగ మెచ్చుకున్నారు. ఇలాంటి మరో క్రికెటర్ పుట్టడంటూ కోహ్లీకి కితాబిచ్చారు. ఫ్యాన్స్ కూడా కోహ్లీ ఈ రికార్డు సాధించడంపై తెగ సంతోషం వ్యక్తం చేశారు. ఇలాంటి సమయంలో పాకిస్తాన్ మాజీ ప్లేయర్ కమ్రాన్ అక్మల్ చేసిన కామెంట్స్ తెగ వైరల్ అవుతోంది.

కోహ్లీ సాధించిన ఈ రికార్డును తమ బాబర్ ఆజమ్ బద్దలు కొడతాడని కమ్రాన్ అక్మల్ అన్నాడు. 'ఆ 50 సెంచరీల రికార్డును టాప్-3లో ఆడే బ్యాటర్ మాత్రమే బద్దలు చేయగలడు. మిడిల్ ఆర్డర్ బ్యాటర్లు ఈ రికార్డు బద్దలు కొట్టడం అసాధ్యం. మా దగ్గర బాబర్ ఆజమ్ ఉన్నాడు. తనొక్కడే ఈ రికార్డు బ్రేక్ చేయగలడు' అని చెప్పాడు.
అదే సమయంలో భారత్ వద్ద కూడా శుభ్మన్ గిల్ ఉన్నాడని, అతను కూడా ఈ రికార్డు వెంట పడగల సమర్ధుడే అని చెప్పాడు. 'బాబర్ టాప్-3లో బ్యాటింగ్ చేస్తాడు. అలాగే భారత్ వద్ద కూడా శుభ్మన్ గిల్ ఉన్నాడు. అతను ఈ రికార్డు వెంట పడతాడు' అని కమ్రాన్ అన్నాడు.
ఇప్పటి వరకు చూసుకుంటే బాబర్ 114 వన్డే ఇన్నింగ్సులు ఆడాడు. వీటిలో 19 సెంచరీలు బాదాడు. అయితే ప్రస్తుతం బాబర్ వయసు 29 సంవత్సరాలే. ఈజీగా ఇంకో 7-8 ఏళ్లు ఆడగల సత్తా బాబర్కు ఉంది. ఇక గిల్ ఇప్పటి వరకు 43 వన్డే ఇన్నింగ్సుల్లో 6 సెంచరీలు చేసి ఉన్నాడు. వీళ్లిద్దరూ కోహ్లీ రికార్డు బద్దలు కొట్టాలంటే ఇంకా చాలా టైం పడుతుంది.