సరికొత్తగా ముస్తాబు
"ఈసారి కొత్త జట్టు పేరుతో, కొత్త జెర్సీతో బరిలో దిగుతున్నా. ఈసారి సీజన్లో ఢిల్లీ రాణిస్తుందని ఆశిస్తున్నా" అని రబాడ అన్నాడు. ఐపీఎల్ 2019 సీజన్ కోసం ఢిల్లీ ఫ్రాంచైజీ సరికొత్తగా ముస్తాబవుతోంది. ఇప్పటికే ఢిల్లీ డేర్డెవిల్స్గా ఉన్న పేరును ఢిల్లీ క్యాపిటల్స్గా పేరు మార్చింది. అంతేకాదు కోచింగ్ సిబ్బంది కూడా అనేక మార్పులు చేసింది.
ముంబై ఇండియన్స్తో తొలి మ్యాచ్
ఈ సీజన్లో ఢిల్లీ క్యాపిటల్స్ కొత్త జెర్సీతో బరిలోకి దిగనుంది. మార్చి 24న వాంఖడేలో ముంబై ఇండియన్స్తో ఢిల్లీ క్యాపిటల్స్ తొలి మ్యాచ్ ఆడనుంది. ఇదిలా ఉంటే, తమ సొంతగ్రౌండ్లో జరిగే తొలి మ్యాచ్ ఆదాయాన్ని పుల్వామా ఉగ్రదాడిలో అమరులైన జవాన్ల కుటుంబాలకు విరాళంగా ఇస్తామని జట్టు యాజమాన్యం ప్రకటించింది. ఈ మేరకు ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు తన ఇనిస్టాగ్రామ్ ఖాతాలో అధికారిక ప్రకటన చేసింది.
|
ఢిల్లీ క్యాపిటల్స్
అట్టిపెట్టుకున్న ఆటగాళ్లు: శిఖర్ ధావన్, శ్రేయస్ అయ్యర్, రిషబ్ పంత్, పృథ్వీ షా, అమిత్ మిశ్రా, అవేష్ ఖాన్, హర్షల్ పటేల్, రాహుల్ తెవాతియా, జయంత్ యాదవ్, మన్జోత్ కల్రా, కాలిన్ మున్రో, క్రిస్ మోరిస్, కగిసో రబాడ, సందీప్ లామిచానే, ట్రెంట్ బౌల్ట్,
వేలంలో కొనుగోలు చేసిన ఆటగాళ్లు: హనుమ విహారీ (రూ. 2 కోట్లు), అక్షర్ పటేల్ (రూ. 5 కోట్లు), ఇషాంత్ శర్మ (రూ.1.1 కోట్లు), అంకుశ్ బెయిన్స్ (రూ.20 లక్షలు), నాథూ సింగ్ (రూ.20 లక్షలు), కాలిన్ ఇన్గ్రామ్ (రూ.6.4 కోట్లు), షెర్ఫేన్ రూథర్ఫర్డ్ (రూ.1.6 కోట్లు), కీమో పాల్ (రూ.50 లక్షలు), జలజ్ సక్సేనా (రూ.20 లక్షలు), బండారు అయ్యప్ప (రూ.20 లక్షలు).