హైదరాబాద్: వెస్టిండిస్తో జరిగిన తొలి టీ20లో ఇంగ్లాండ్ నాలుగు వికెట్ల తేడాతో విజయం సాధించింది. ఇంగ్లాండ్ ఆటగాడు జానీ బెయిర్స్టో (40 బంతుల్లో 68; 9 ఫోర్లు, 2 సిక్సర్లు) అద్భుత ప్రదర్శన చేసి జట్టు విజయంలో కీలకపాత్ర పోషించాడు. దీంతో మూడు టీ20ల సిరిస్లో ఇంగ్లాండ్ 1-0 ఆధిక్యంలో నిలిచింది.
అభిమానిని ధోని పరిగెత్తించడంపై కామెంట్రీ బాక్సులో గవాస్కర్ సరదా వ్యాఖ్యలు
ఈ మ్యాచ్లో టాస్ ఓడి తొలుత బ్యాటింగ్కు దిగిన వెస్టిండిస్ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్లకు 160 పరుగులు చేసింది. నికోలస్ పూరణ్ (37 బంతుల్లో 58; 3 ఫోర్లు, 4 సిక్స్లు) హాఫ్ సెంచరీ సాధించగా... టామ్ కుర్రాన్ (4/36) దెబ్బకు డాషింగ్ ఓపెనర్ క్రిస్గేల్ (15), హోప్ (6), హెట్మెయర్ (14) విఫలమయ్యారు.
Last night we took a 1-0 lead in our IT20 series against the Windies! 👏
— England Cricket (@englandcricket) March 6, 2019
Scorecard 👇
అయితే డారెన్ బ్రావో (28), పూరన్ నాలుగో వికెట్కు 64 పరుగులు జోడించడంతో వెస్టిండిస్ జట్టు గౌరవప్రదమైన స్కోరు చేసింది. ఇంగ్లండ్ బౌలర్లలో టామ్ కరన్ 36 పరుగులిచ్చి 4 వికెట్లు తీశాడు. అనంతరం బ్యాటింగ్కు దిగిన ఇంగ్లండ్ 18.5 ఓవర్లలో 6 వికెట్లకు 161 పరుగులు చేసింది.
ఇంగ్లాండ్ బ్యాట్స్మెన్లో ఓపెనర్ జానీ బెయిర్స్టో (40 బంతుల్లో 68; 9 ఫోర్లు, 2 సిక్స్లు), జో డెన్లీ (29 బంతుల్లో 30; 4 ఫోర్లు) రాణించారు.
FIFTY for @jbairstow21!! 🙌
— England Cricket (@englandcricket) March 5, 2019
Scorecard: https://t.co/wdEbPFQO39#WIvENG pic.twitter.com/a6UwqnZxQN