
కర్ణాటక జట్టుతో తలపడనున్న ధోనీ సేన
హజారే ట్రోఫీలో భాగంగా ఫిబ్రవరి 25న జరిగే తొలి మ్యాచ్లో కర్ణాటక జట్టుతో ధోనీ సేన తలపడనుంది. ఇదిలా ఉంటే ఈ ఏడాది విజయ్ హాజారే ట్రోఫీలో స్టార్ క్రికెటర్లు ఆడుతండటం విశేషం.

చాలామంది సీనియర్లు
దేశవాళీ వన్డే టోర్నీగా భావించే ఇందులో ధోని, యువరాజ్, హర్భజన్ సింగ్, సురేశ్ రైనా, శిఖర్ ధావన్, మనీష్ పాండేలతో పాటు చాలామంది సీనియర్లు ఆడుతున్నారు.

సత్తా చాటేందుకు సిద్ధమైన యువ ఆటగాళ్లు
ఈ ఏడాది జూన్లో ఇంగ్లాండ్లో జరిగే ఛాంపియన్స్ ట్రోఫీ జట్టు ఎంపిక కోసం విజయ్ హజారే ట్రోఫీలో ప్రదర్శనను పరిగణనలోకి తీసుకుంటామని సెలక్టర్లు చెప్పిన నేపథ్యంలో ఈ టోర్నీలో సత్తా చాటాలని చాలా మంది యువ ఆటగాళ్లు సత్తా చాటేందుకు సిద్ధమయ్యారు.

28 జట్లు నాలుగు గ్రూప్లుగా విడిపోయి
మొత్తం 28 జట్లు నాలుగు గ్రూప్లుగా విడిపోయి విజయ్ హజారే ట్రోఫీ కోసం పోటీపడుతున్నాయి. శనివారం గ్రూప్ సీలో భాగంగా ఆంధ్ర ప్రదేశ్ జట్టు బెంగాల్ను గ్రూప్ డిలో హైదరాబాద్ జట్టు జమ్మూకాశ్మీర్తో ఆడనున్నాయి.


Click it and Unblock the Notifications











