
పూర్తిస్థాయి ఫిట్నెస్ కలిగి ఉండాలి
భారత జట్టులో ఆటగాళ్లంతా పూర్తిస్థాయి ఫిట్నెస్ కలిగి ఉండాలన్న కోహ్లీ నిర్ణయాన్ని తప్పకుండా గౌరవించాల్సిన అవసరం ఉందని కపిల్ దేవ్ అభిప్రాయపడ్డాడు. ప్రస్తుతం ప్రపంచ క్రికెట్లో భారత జట్టు అత్యుత్తమ ఫిట్ నెస్ స్థాయిని కలిగి ఉందంటే దానికి కోహ్లీనే కారణమంటూ కపిల్ దేవ్ ప్రశంసల వర్షం కురిపించాడు.

జట్టంతా పూర్తి ఫిట్నెస్తో ఉండాలని కోరుకుంటాడు
'ఏ జట్టు కెప్టెన్ అయినా తన జట్టే మెరుగ్గా రాణించాలనుకుంటాడు. అందుకోసం ఎన్నో ఆలోచనలు చేస్తాడు. జట్టంతా పూర్తి ఫిట్నెస్తో ఉండాలని కోరుకుంటాడు. అతని నిర్ణయాన్ని అందరూ గౌరవించాలి. ఈ విషయంలో కోహ్లీకే నా పూర్తి మద్దతు ప్రకటిస్తా. నువ్వు ఎంత గొప్ప ఆటగాడివి అయినా మైదానంలో క్యాచ్లు పట్టకపోతే ప్రత్యర్థి జట్టుకు ఎక్కువ పరుగులు లభిస్తాయి' అని కపిల్ తెలిపాడు.

ఆటగాళ్లు ఫిట్నెస్ను కాపాడుకోవాలి
దీని వల్ల ప్రత్యర్ధి జట్టుకు ఎంతో లాభమని కపిల్ పేర్కొన్నాడు. అందుకే ఆటగాళ్లు ఫిట్నెస్ను కాపాడుకోవాలని, ఇందులో భాగమే యో యో పరీక్ష అని అన్నాడు. దీనిని తప్పుపట్టాల్సిన అవసరం ఎంతమాత్రం లేదని కపిల్దేవ్ తెలిపాడు. ఇప్పటివరకు 28 వన్డేల్లో 52 వికెట్లు తీశాడు. అలాగే 28 టీ20ల్లో 38 వికెట్లను తన ఖాతాలో వేసుకున్నాడు.

2016 జనవరిలో అంతర్జాతీయ క్రికెట్లోకి అడుగుపెట్టిన బుమ్రా
2016 జనవరిలో అంతర్జాతీయ క్రికెట్లోకి అడుగుపెట్టిన బుమ్రా న్యూజిలాండ్తో ముగిసిన వన్డే సిరీస్లోనూ అతను అద్భుతంగా రాణించి జట్టు విజయాల్లో కీలకపాత్ర పోషించాడు. ఆదివారం కాన్పూర్ వేదికగా జరిగిన చివరి వన్డేలో కీలక సమయంలో కివీస్ బ్యాట్స్మెన్ టేలర్ను బోల్తా కొట్టించి భారత్కు విజయాన్ని అందించాడు.


Click it and Unblock the Notifications











