సూపర్ ఓవర్తో ఫలితం:
సూపర్ ఓవర్లో భాగంగా తొలుత బ్యాటింగ్ చేసిన సన్రైజర్స్ హైదరాబాద్ 2 వికెట్లు కోల్పోయి 8 పరుగులు చేసింది. ముంబై బౌలర్ జస్ప్రీత్ బుమ్రా సూపర్ ఓవర్ వేసాడు. అనంతరం సన్రైజర్స్ బౌలర్ రషీద్ బౌలింగ్ వేయగా.. ముంబై కేవలం మూడు బంతుల్లోనే లక్ష్యాన్ని చేధించింది. ఈ విజయంతో ప్లేఆఫ్కు చేరిన మూడో జట్టుగా ముంబై నిలిచింది.
స్పిన్నర్లదే కీలకపాత్ర:
ఈ మ్యాచ్తో పాయింట్ల పట్టికలో టాప్ 4లోకి రావడం ఆనందంగా ఉంది. ఇది ఊరికే రాలేదు, మేం గత కొంతకాలంగా నిలకడగా ఆడుతున్నాం కాబట్టే ఫలితం పొందాం. ఈ మ్యాచ్లో భారీ లక్ష్యాన్ని నిర్దేశించాలనుకున్నాం. కానీ మా బ్యాట్స్మెన్ మధ్య ఓవర్లలో వెంటవెంటనే వికెట్లు కోల్పోవడంతో స్కోరు చేయలేకపోయాం. 40 వర్ల పాటు పిచ్ ఒకేలా స్పందించింది. సన్రైజర్స్ బ్యాట్స్మన్ మనీశ్పాండే అద్భుతంగా ఆడాడు. కొన్ని మంచి షాట్లు కొట్టాడు. అయితే, మ్యాచ్ను మా వైపు తిప్పింది మాత్రం ఎనిమిది ఓవర్ల స్పిన్ బౌలింగే. ఈ విజయంలో స్పిన్నర్లదే కీలకపాత్ర' అని రోహిత్ తెలిపాడు.
డెత్ ఓవర్లలలో బుమ్రా దిట్ట:
బుమ్రా అద్భుతంగా బౌలింగ్ చేసాడు. అతడు ప్రతి మ్యాచ్లోనూ మెరుగుపడుతున్నాడు. విజయం సాధించాలని కసి ఉంది. మా జట్టులో అతనే కీలక బౌలర్. డెత్ ఓవర్లు వేయడంలో బుమ్రా దిట్ట. అందుకే సూపర్ ఓవర్ బుమ్రాతో వేయించాలని నిర్ణయించుకున్నాం. ఆ ఓవర్లో బుమ్రా తెలివిగా బౌలింగ్ చేశాడు. బ్యాటింగ్లో ఉన్న లోపాలు సరిదిద్దుకుంటాం. డికాక్ ఒక్కడే ఒంటరి పోరాటం చేశాడు. అతడికి ఇతర బ్యాట్స్మెన్ సహకారం అందించాల్సి ఉంది. కొన్ని మ్యాచ్లలో మాత్రమే మా బ్యాటింగ్ బాగాలేదు. మేము పుంజుకుంటాం' అని రోహిత్ ధీమా వ్యక్తం చేసాడు.