బుమ్రాని ప్రత్యేకంగా నిలిపేది యార్కరే
"కానీ అతణ్ని ప్రత్యేకంగా నిలిపేది యార్కర్ మాత్రమే. వన్డేల్లోనే కాదు అతను టెస్టుల్లోనూ ఆ తరహా బంతులను విజయవంతంగా వేస్తున్నాడు. అప్పట్లో నేను, వకార్ యూనిస్ అలా చేసేవాళ్లం" అని అక్రమ్ అన్నాడు. పాక్ నుంచి తనలాంటి బౌలర్ వచ్చినా, భారత్ నుంచి బుమ్రా లాంటి పేసర్ వచ్చినా కూడా దానికి కారణం టెన్నిస్ బాల్ క్రికెట్ అని చెప్పాడు.
అత్యధిక వికెట్లు తీసిన ఆటగాడిగా
ఇటీవలే ఆస్ట్రేలియాతో ముగిసిన నాలుగు టెస్టు మ్యాచ్ల సిరిస్లో జస్ప్రీత్ బుమ్రా అత్యధిక వికెట్లు తీసిన ఆటగాడిగా గుర్తింపు పొందాడు. ఈ టెస్టు సిరిస్లో జస్ప్రీత్ బుమ్రా 21 వికెట్లు తీయడం విశేషం. ఓ టెస్టు సిరిస్లో అత్యధిక వికెట్లు తీసిన భారత ఆటగాళ్ల జాబితాలో బుమ్రా (21 వికెట్లు) రెండో స్థానంలో కొనసాగుతున్నాడు.
బుమ్రా స్థానంలో మహమ్మద్ సిరాజ్
1991/92 ఆసీస్ పర్యటనలో మాజీ క్రికెట్ దిగ్గజం కపిల్ దేవ్(25) వికెట్లు తీశాడు. అయితే అది ఐదు టెస్టు మ్యాచ్ల సిరిస్ కావడం విశేషం. కాగా, ఆస్ట్రేలియాతో జరిగే మూడు వన్డేల సిరిస్తో పాటు న్యూజిలాండ్ పర్యటనకు సైతం టీమిండియా పేసర్ జస్ప్రీత్ బుమ్రాకి సెలక్టర్లు విశ్రాంతినిచ్చారు. బుమ్రా స్థానంలో మహమ్మద్ సిరాజ్ను ఎంపిక చేసిన సంగతి తెలిసిందే.