
ఛేదనలో చెలరేగిన రాయ్
అనంతరం లక్ష్యఛేదనలో జేసన్ రాయ్ (89 బంతుల్లో 114; 11 ఫోర్లు, 4 సిక్సర్లు), బెన్ స్టోక్స్ (64 బంతుల్లో 71 నాటౌట్; 5 ఫోర్లు, 3 సిక్సర్లు) చెలరేగడంతో ఇంగ్లాండ్ 49.3 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 341 పరుగులు చేసి విజయం సాధించంది. ఓపెనర్ జేసన్ రాయ్ తొలి వికెట్కు జేమ్స్ విన్స్(43)తో కలిసి 94 పరుగులు జోడించాడు.

రెండో వికెట్కు 107 పరుగుల భాగస్వామ్యం
ఆ తర్వాత జో రూట్తో కలిసి రెండో వికెట్కు 107 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పి ఆ తర్వాత 114 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద ఔటయ్యాడు. వన్డేల్లో రాయ్కి ఇది ఎనిమిదవ సెంచరీ కావడం విశేషం. రాయ్ ఔటైన తర్వాత ఎనిమిది పరుగుల తేడాతో రూట్(36), బట్లర్( 0), అలీ(0) వికెట్లు కోల్పో యి కష్టాల్లో పడింది.

చివరి వన్డే ఆదివారం
ఈ దశలో క్రీజులోకి వచ్చిన ఆల్రౌండర్ బెన్ స్టోక్స్, టామ్ కర్రాన్(31)తో కలిసి జట్టుకు విజయాన్నందించాడు. ఇరు జట్ల మధ్య తొలి వన్డే వర్షం కారణంగా రద్దు కాగా... ఆ తర్వాతి 3 వన్డేల్లో గెలుపొందిన ఇంగ్లాండ్ 3-0తో సిరీస్ను సొంతం చేసుకుంది. ఈ సిరీస్లో నామమాత్రమైన చివరి వన్డే ఆదివారం జరుగనుంది.

రాయ్ మాట్లాడుతూ
మ్యాచ్ అనంతరం జేసన్ రాయ్ మాట్లాడుతూ "మ్యాచ్కు ముందురోజు నా కుమార్తె ఎవర్లీ అస్వస్థతకు గురైంది. రాత్రి 1.30 గంటలకు ఆసుపత్రికి తీసుకెళ్లా. ఉదయం 8.30 గంటల వరకు అక్కడే ఉండి ఇంటికి తిరిగొచ్చా. అనంతరం కొద్దిసేపు పడుకున్నా. వార్మప్ చేసి మ్యాచ్లో బరిలో దిగా. సెంచరీ సాధిస్తానని అనుకోలేదు" అని అన్నాడు.


Click it and Unblock the Notifications
