హైదరాబాద్: ఇంగ్లాండ్పై ఐదు టెస్టు మ్యాచ్ల సిరిస్ను 4-0తో భారత్ విజయం సాధించిన నేపథ్యంలో ఐసీసీ టెస్టు ర్యాంకుల్లో టీమిండియా బౌలర్లు రికార్డులు సృష్టిస్తున్నారు. తాజాగా ఐసీసీ ప్రకటించిన టెస్టు ర్యాంకుల్లో టీమిండియా ఆఫ్ స్పిన్నర్ నెంబర్ వన్ ర్యాంకులో కొనసాగుతున్నాడు.
ఎగిరి గంతేశాడు: చెన్నై గెలుపుతో కోహ్లీ సేన సరికొత్త టెస్టు రికార్డు
ఇక చెన్నై టెస్టులో ఇంగ్లాండ్పై ఇన్నింగ్స్ 45 పరుగుల తేడాతో విజయం సాధించడంలో కీలకపాత్ర పోషించిన రవీంద్ర జడేజా రెండో స్ధానంలో నిలిచాడు. కెరీర్లో తొలిసారి టెస్టులో పది వికెట్లు తీసిన జడేజా 66 పాయింట్లతో నాలుగు స్ధానాలు ఎగబాకి రెండో స్ధానంలో నిలిచాడు.
దీంతో 1974 తర్వాత ఐసీసీ టెస్టు ర్యాంకుల్లో తొలి రెండు స్థానాల్లో నిలిచిన భారత బౌలర్లుగా రవిచంద్రన్ అశ్విన్, రవీంద్ర జడేజా చరిత్ర సృష్టించారు. 1974లో భారత స్పిన్ ద్వయం బిషన్సింగ్ బేడీ, భగవత్ చంద్రశేఖర్లు టెస్టు ర్యాంకుల్లో తొలి రెండు స్థానాల్లో నిలిచారు.
కెప్టెన్గా కోహ్లీ అరుదైన ఘనత: అజారుద్దీన్ రికార్డు సమం
ఐదు టెస్టు మ్యాచ్ల సిరిస్లో చివరిదైన చెన్నై టెస్టులో 154 పరుగులిచ్చి 10 వికెట్లు తీసిన జడేజా భారత విజయంలో కీలకపాత్ర పోషించిన సంగతి తెలిసిందే. ఈ అత్యుత్తమ ప్రదర్శనతో జడేజాకు 66 పాయింట్లు లభించాయి. దీంతో అతను అశ్విన్ కంటే కేవలం 8 పాయింట్ల తేడాతో రెండోస్థానంలో నిలిచాడు.
ఇంగ్లాండ్ సిరిస్లో జడేజా మొత్తం 26 వికెట్లు తీశాడు. జోష్ హేజిల్వుడ్, జేమ్స్ ఆండర్సన్, డేల్ స్టెయిన్, రంగన హెరాత్లను వెనక్కి నెట్టి జడేజా రెండోస్థానంలో నిలిచాడు. ఇక ఐసీసీ విడుదల చేసిన ఆల్రౌండర్ల జాబితాలో జడేజా మూడో ర్యాంకులో కొనసాగుతున్నాడు.