బంగ్లాదేశ్ ఏమి చేస్తుందని సెహ్వాగ్ ప్రశ్న!
శ్రీలంక వేదికగా జరిగిన నిదాహాస్ ట్రోఫీలో బంగ్లాదేశ్ క్రికెటర్లు చేసిన నాగిని డ్యాన్స్ని కూడా ప్రస్తావిస్తాడు. అంతేకాదు, టీమిండియాపై బంగ్లాదేశ్ జట్టు తొలి టీ20 మ్యాచ్ గెలిస్తే ఏమి చేస్తుంది? అని కూడా సెహ్వాగ్ ప్రశ్నిస్తాడు. సెహ్వాగ్ ఏమంటా ప్రశ్నించాడో ఏమో తెలియదు గానీ ఢిల్లీ వేదికగా జరిగిన తొలి టీ20లో బంగ్లాదేశ్ విజయం సాధించింది.
|
సెహ్వాగ్పై ట్విట్టర్లో ట్రోల్స్
దీంతో బంగ్లా ఆటగాళ్ల ఆనందానికి అవధుల్లేకుండా పోయింది. మరోవైపు టీమిండియాపై బంగ్లా తొలి టీ20 మ్యాచ్ గెలిస్తే ఏమి చేస్తుందని ప్రశ్నించిన సెహ్వాగ్ను సోషల్ మీడియా వేదికగా అభిమానులు ఓ ఆట ఆడుకున్నారు. "సెహ్వాగ్ ఇలాంటి యాడ్ల్లో నటించడం దయచేసి మానేయండి. మీ వల్లే టీమిండియా ఓడింది" అంటూ ఓ అభిమాని ఆవేదన వ్యక్తం చేశాడు.
|
నువ్వు ట్వీట్ చేయడం ఇక ఆపేయి
"హల్లో వీరేంద్ర సెహ్వాగ్ బంగ్లాదేశ్ విజయం సాధించింది... ఇప్పుడు ఏం చేస్తావ్? డ్రామా లేక ట్వీట్?" అంటూ మరొక అభిమాని ట్వీట్ చేశాడు. "వీరేంద్ర సెహ్వాగ్ బ్రో నువ్వు ట్వీట్ చేయడం ఇక ఆపేయి... బంగ్లాదేశ్ విజయం సాధించింది. ఒక మనిషిగా మాటమీద నిలబడు" అంటూ ఓ నెటిజన్ చురకలంటించాడు.
రాజ్ కోట్ వేదికగా రెండో టీ20
మూడు టీ20ల సిరిస్లో భాగంగా ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియంలో జరిగిన తొలి టీ20లో బంగ్లాదేశ్ విజయం సాధించడంతో ఈ సిరిస్లో 1-0 ఆధిక్యంలో నిలిచింది. దీంతో రాజ్ కోట్ వేదికగా జరగనున్న రెండో టీ20లో విజయం సాధించి సిరీస్ను 1-1తో సమం చేయాలనే గట్టి పట్టుదలతో రోహిత్ సేన ఉంది.