For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

ఛేదనలో 22, కెప్టెన్‌గా 14: తొలి వన్డే విజయంపై కోహ్లీ ఏమన్నాడంటే!

Its never too difficult when you have Rohit at the other end: Virat Kohli

హైదరాబాద్: "మరో ఎండ్‌లో రోహిత్ శర్మ ఉన్నాడంటే మన పని ఎప్పుడూ సులువే" అని మ్యాచ్ అనంతరం టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ వ్యాఖ్యానించాడు. గువహటి వేదికగా ఆదివారం జరిగిన తొలి వన్డేలో ఆతిథ్య భారత జట్టు వెస్టిండిస్‌పై 8 వికెట్ల తేడాతో విజయం సాధించిన సంగతి తెలిసిందే.

మ్యాచ్ అనంతరం టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ మాట్లాడుతూ "సాధికారిక విజయం తర్వాత చాలా సంతోషంగా ఉంది. వెస్టిండీస్‌ చాలా బాగా బ్యాటింగ్‌ చేసింది. 320 పరుగులకు పైగా ఛేదన అంటే ఎప్పుడూ అంత సులువు కాదు. అయితే ఒక భారీ భాగస్వామ్యం చాలనే విషయం తెలుసు. మరో ఎండ్‌లో రోహిత్‌ శర్మ ఉన్నాడంటే మన పని ఎప్పుడూ సులువే" అని అన్నాడు.

1
44266

నడిపించే బాధ్యత తీసుకుంటానని రోహిత్‌కు చెప్పేశా

"టాప్‌-3లో రోహిత్‌ శర్మ సహాయక పాత్ర పోషించడం చాలా అరుదు. సాధారణంగా నేను ఆ పని చేస్తుంటా. ఈ రోజు నేను నడిపించే బాధ్యత తీసుకుంటానని రోహిత్‌కు చెప్పేశాను. నేను ఔటయ్యాక అతనూ అదే పని చేశాడు. రోహిత్‌తో కలిసి ఆడటం చాలా బాగుంటుంది. ఇది మా ఐదో డబుల్‌ సెంచరీ భాగస్వామ్యం" అని కోహ్లీ చెప్పాడు.

 మరికొన్నేళ్లు మాత్రమే మిగిలి ఉన్నాయి

మరికొన్నేళ్లు మాత్రమే మిగిలి ఉన్నాయి

"ఆటను ఆస్వాదించేందుకు నా కెరీర్‌లో మరికొన్నేళ్లు మాత్రమే మిగిలి ఉన్నాయి. దేశం తరఫున ఆడటం గర్వకారణం కాబట్టి ఏ మ్యాచ్‌ను కూడా తక్కువగా చూడరాదు. ఆటను తేలికగా తీసుకోను. నా వంతు మైదానంలో మెరుగైన ప్రదర్శన ఉండేలా జాగ్రత్త పడతాను. ఇక జట్టు బాధ్యత కూడా నాదే కాబట్టి నేను మరింత జాగ్రత్తగా వ్యవహరించాల్సి ఉంటుంది. ఈ క్రమంలో కొన్ని సార్లు ఒత్తిడి ఎదురవుతుంది. దాన్ని అధిగమించి నా పని నేను చేసుకుంటూ పోవాలి. మనం ఎంత కష్టపడి ఆడతామో ఆ కష్టం.. విజయం, ప్రశంసల రూపంలో మనకు తిరిగి వస్తుంది" అని విరాట్ కోహ్లీ వెల్లడించాడు. కాగా, తొలి వన్డేలో విరాట్ కోహ్లీ-రోహిత్ శర్మల జోడీ రెండో వికెట్‌కు 246 పరుగుల భాగస్వామ్యాన్ని నమోదు చేసిన సంగతి తెలిసిందే.

323 పరుగుల విజయ లక్ష్యాన్ని 42.1 ఓవర్లలోనే

323 పరుగుల విజయ లక్ష్యాన్ని 42.1 ఓవర్లలోనే

వెస్టిండిస్ నిర్దేశించిన 323 పరుగుల విజయ లక్ష్యాన్ని 42.1 ఓవర్లలోనే ఛేదించింది. భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన భారత్‌కు ఆదిలోనే ఎదురుదెబ్బ తగిలింది. ఓపెనర్‌ శిఖర్‌ ధావన్‌(4) రెండో ఓవర్‌లోనే పెవిలియన్‌ చేరాడు. అనంతరం క్రీజులోకి వచ్చిన కోహ్లీ.. రోహిత్ అందించిన సహకారంతో చెలరేగిపోయాడు. ఇద్దరూ కలిసి స్కోరు బోర్డును పరుగులు పెట్టించారు.

సెంచరీలు మోత మోగించిన రోహిత్, కోహ్లీ

సెంచరీలు మోత మోగించిన రోహిత్, కోహ్లీ

ఒకవైపు రోహిత్‌ శర్మ కుదురుగా బ్యాటింగ్‌ చేస్తే, కోహ్లీ మాత్రం బౌండరీల మోత మోగించాడు. దీంతో భారత్‌ 10 ఓవర్లలోనే 71 పరుగులు చేసింది. అనంతరం తనదైన శైలిలో మెరుపులు మెరిపించిన కోహ్లీ 88 బంతుల్లోనే సెంచరీ పూర్తి చేసుకున్నాడు. వన్డేల్లో కోహ్లీకి ఇది 36వ సెంచరీ. ఆ తర్వాత కాసేపటికే రోహిత్ శర్మ కూడా కెరీర్‌లో 20వ సెంచరీ నమోదు చేశాడు.

 కోహ్లీ, రోహిత్‌లు కలిసి నాలుగుసార్లు సెంచరీలు నమోదు

కోహ్లీ, రోహిత్‌లు కలిసి నాలుగుసార్లు సెంచరీలు నమోదు

84 బంతుల్లో 10 ఫోర్లు, 5 సిక్సర్లతో 100 పరుగులు పూర్తి చేసుకున్నాడు. ఈ ఇద్దరు కలిసి నాలుగుసార్లు సెంచరీలు నమోదు చేయడం గమనార్హం. తద్వారా భారత్‌ తరపున గంగూలీ, టెండూల్కర్‌ల పేరిట ఉన్న ఈ రికార్డును సమం చేశారు. ఈ క్రమంలో కోహ్లీ140 పరుగుల వద్ద బిషూ బౌలింగ్‌లో స్టంపౌట్‌ కావడంతో రెండో వికెట్‌కు నమోదైన 246 పరుగుల భాగస్వామ్యానికి తెరపడింది.

తొలుత బ్యాటింగ్ చేసిన విండీస్ 322/8

తొలుత బ్యాటింగ్ చేసిన విండీస్ 322/8

కోహ్లీ ఔటైన తర్వాత క్రీజులోకి వచ్చిన అంబటి రాయుడు (22 నాటౌట్‌) రోహిత్‌కు అండగా నిలవడంతో భారత్‌ 42.1 ఓవర్లలోనే విజయాన్నందుకుంది. వెస్టిండిస్ బౌలర్లలో బిషూ, థోమస్‌లు తలో వికెట్‌ తీసుకున్నారు. అంతకుముందు టాస్ తొలుత బ్యాటింగ్ చేసిన విండీస్ నిర్ణీత 50 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 322 పరుగులు చేసింది.

Story first published: Monday, October 22, 2018, 15:03 [IST]
Other articles published on Oct 22, 2018
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+