మ్యాచ్ రద్దయితే ఏమౌతుంది? చెరో పాయింట్ ఇస్తారు. అత్యధిక పాయింట్లు, మెరుగైన రన్రేట్ను పరిగణనలోకి తీసుకుంటుంది అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్. ఇప్పటికే 15 పాయింట్లతో పట్టికలో అగ్రస్థానంలో కొనసాగుతున్న టీమిండియా ఆటోమేటిక్గా ఫైనల్కు చేరుకుంటుంది. పాయింట్ల పట్టికలో టీమిండియా అగ్రస్థానంలో కొనసాగుతుండగా.. న్యూజిలాండ్ నాలుగో స్థానంలో ఉంది. ఆడిన తొమ్మిది మ్యాచుల్లో అయిదింట్లో నెగ్గి, మూడింట్లో ఓటమి పాలయ్యారు బ్లాక్ క్యాప్స్.
బెట్టింగ్ బాబుల ఓటు ఎటు? ఆ జట్టుపై పందెం గెలిస్తే జాక్ పాట్ కొట్టినట్టే!
దీనితో వారి ఖాతాలో ప్రస్తుతం 11 పాయింట్లే ఉన్నాయి. అదే వారికి శాపంగా మారే అవకాశాలు లేకపోలేదు. వర్షం వల్ల ఒక పాయింట్ దక్కినప్పటికీ.. వాటి సంఖ్య డజనుకే చేరుకుంటుంది. వర్షం పడి- రిజర్వ్ డే కూడా మ్యాచ్ రద్దయితే- మెరుగైన రన్ రేట్, పాయింట్లను కలిగి ఉండటం వల్ల టీమిండియా ఫైనల్కు చేరుకుంటుంది. న్యూజిలాండ్ క్రికెటర్లు ఇక ఇంటిదారి పట్టాల్సి ఉంటుంది.