
అదే న్యూజిలాండ్కు ప్లస్:
బీసీసీఐ టీవీతో టీమిండియా వెటరన్ ఆఫ్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ మాట్లాడుతూ... 'ప్రపంచ టెస్టు ఛాంపియన్షిప్ ఫైనల్స్లో న్యూజిలాండ్ కచ్చితమైన ప్రణాళికతో పాటు కలిసికట్టుగా బరిలోకి దిగుతుంది. దానికంటే ముందు ఇంగ్లండ్తో రెండు టెస్టులు ఆడటం కూడా ఆ జట్టుకు కలిసివస్తుంది. ఇప్పటికే ఇంగ్లీష్ పరిస్థితులపై వారికి ఓ అవగాహన వచ్చిఉంటుంది. కివీస్ కండిషన్స్ దాదాపుగా సమానం. ఈ విషయంలో అక్కడి పరిస్థితులకు తగ్గట్టుగా భారత్ జట్టు మారి అలవాటు పడాలి. అదే టీమిండియాకు కీలకం' అని అన్నాడు.

ప్రపంచకప్ ఫైనల్తో సమానం:
సీనియర్ పేసర్ ఇషాంత్ శర్మ మాట్లాడుతూ... 'ఈ టెస్టు ఛాంపియన్షిప్ కష్టతరమైన ప్రయాణం. అలాగే భావోద్వేగమైంది కూడా. ఇది ఐసీసీ టోర్నమెంట్ అయినందున.. 50 ఓవర్ల ప్రపంచకప్ ఫైనల్తో సమానం. 2019లో వెస్టిండీస్తో ఈ ఛాంపియన్షిప్ పోటీలు ప్రారంభమైనప్పుడు కెప్టెన్ విరాట్ కోహ్లీ ఓ మాట చెప్పాడు. 'ఇది కేవలం నెల రోజుల కష్టం కాదు. రెండేళ్లు సాగే సుదీర్ఘ ప్రయాణం' అని అన్నాడు' అని గుర్తుచేశాడు. కొవిడ్-19తో ఈ టోర్నీలో నియమాలు మారినప్పుడు భారత్ కష్టపడాల్సి వచ్చిందని లంబూ తెలిపాడు. క్లిష్ట పరిస్థితుల్లోనే ఆస్ట్రేలియాపై విజయం సాధించామని, ఆపై ఇంగ్లండ్తోనూ గెలుపొందామని ఇషాంత్ వివరించాడు.

ఆత్మవిశ్వాసం రెట్టింపు అయింది:
ఆస్ట్రేలియా పర్యటనపై స్పందించిన మరో పేసర్ మొహ్మద్ షమీ.. తమ రెండేళ్ల కష్టానికి అదే అసలైన పరీక్ష అని, అక్కడ విజయం సాధించడం కీలకమని పేర్కొన్నాడు. అందుకోసం తాము 110 శాతం కష్టపడాల్సి వచ్చిందన్నాడు. సీనియర్లు లేకున్నా యువ ఆటగాళ్లు కంగారూలపై సిరీస్ గెలవడం తనకు అమితానందం కలిగించిందని చెప్పాడు. ఆటగాళ్లు నేర్చుకునేందుకు ఆ టోర్నీ ఒక ఉదాహరణ అని, ఆ గెలుపుతో ఆత్మవిశ్వాసం రెట్టింపు అవుతుందని షమీ అన్నాడు. డబ్ల్యూటీసీ గెలిచేందుకే ఇక్కడికి వచ్చామని షమీ చెప్పుకొచ్చాడు.

ముమ్మరంగా సాధన:
ఫైనల్ కోసం భారత క్రికెట్ జట్టు ముమ్మరంగా సాధన చేస్తోంది. భారత ఆటగాళ్లకు ఇంట్రా-స్క్వాడ్ మ్యాచ్ నిర్వహించారు. మహ్మద్ సిరాజ్, మహ్మద్ షమీ బౌలింగ్ చేయగా.. చేటేశ్వర్ పుజారా, శుభ్మన్ గిల్ బ్యాటింగ్ చేశారు. మిగతా ఆటగాళ్లు ఫీల్డింగ్ చేశారు. కెప్టెన్ విరాట్ కోహ్లీ ప్రాక్టీస్ మ్యాచ్ను పర్యవేక్షించాడు. మ్యాచ్కు సంబంధించిన ఫొటోలను బీసీసీఐ ట్విటర్లో పోస్ట్ చేసింది.


Click it and Unblock the Notifications












