మూడో వన్డేలో 303 పరుగులు చేసిన భారత్
ఏడు వన్డేల సిరీస్లో అప్పటికే 1-1తో రెండు జట్లు సమంగా నిలిచాయి. మూడో వన్డేలో భారత్ 303 పరుగులు చేసింది. కంగారూల విజయానికి 18 బంతుల్లో 44 పరుగులు అవసరం. కానీ ఇషాంత్ వేసిన 48వ ఓవర్లో జేమ్స్ ఫాల్కనర్ 30 పరుగులు పిండుకున్నాడు. దీంతో ఆసీస్ సునాయాసంగా గెలుపొందింది.
భార్య ప్రతిమా సింగ్ ఇలా
ఇషాంత్ ఆ బాధ నుంచి బయటకు రావడానికి భార్య ప్రతిమా సింగ్, అతడి ఫ్రెండ్ రాజివ్ మహాజన్ ఎంతగానో ప్రయత్నించారు. ఈ విషయాన్ని లంబూ భార్య ప్రతిమా సింగ్ వెల్లడించారు. ఈ సంఘటనపై ప్రతిమా సింగ్ మాట్లాడుతూ "ఇషాంత్ అంతలా ఏడవడటం నా జీవితంలో ఎప్పుడూ చూడలేదు. క్రికెటే జీవితం కాదు. అంతకు మించి జీవితం ఎంతో పెద్దది, క్రికెట్కు అంత ప్రాధాన్యం ఇవ్వొద్దని ఊరడించే ప్రయత్నం చేశా" అని ఆమె అన్నారు.
ఫల్కనర్కు మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు
ఈ మ్యాచ్లో 29 బంతుల్లో 64 పరుగులు చేసి ఆస్ట్రేలియా విజయంలో కీలక పాత్ర పోషించిన ఫల్కనర్కు మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు లభించింది. ఆ సిరీస్లో రెండు మ్యాచ్లు రద్దు కాగా.. భారత్ 3-2తో సిరీస్ను సొంతం చేసుకుంది. చివరి వన్డేలో రోహిత్ శర్మ డబుల్ సెంచరీతో చెలరేగడంతో భారత్ విజయం సాధించింది.
ఒకే ఓవర్లో 30 పరుగులిచ్చిన ఇషాంత్
ఒకే ఓవర్లో 30 పరుగులు ఇచ్చినందుకుగాను మూడో వన్డే తర్వాత ఇషాంత్పై వేటుపడింది. అంతేకాదు ఈ చెత్త ప్రదర్శన ఇషాంత్ వన్డే కెరీర్పై తీవ్ర ప్రభావాన్ని చూపించింది. మొహాలీ వన్డే తర్వాత ఇషాంత్ కేవలం 12 వన్డేలు మాత్రమే ఆడాడు. 2016లో భారత్ తరుపున తన చివరి వన్డేని ఆడిన సంగతి తెలిసిందే.