హిందీలో కొన్ని పంక్తులను పోస్ట్లో పేర్కొంటూ
ఇక సెలెక్షన్ అనంతరం ఇషాన్ కిషన్ తన ఇన్స్టాగ్రామ్లో ఓ ఆసక్తికర పోస్ట్ పెట్టాడు. సెలెక్ట్ కానందుకు ఇషాన్ చాలా బాధపడి ఉండొచ్చని ఆ పోస్ట్ చూస్తే అర్థమవుతుంది. అలాగే అతను ఈ నిరాశజనక పరిస్థితి నుంచి ఎలా బయటపడాలనే విషయాన్ని బెల్లా రాసిన 'హంబుల్ పోయెట్' కవితలోని కొన్ని పంక్తులను ఉదాహరిస్తూ తన ఇన్స్టాగ్రామ్ స్టోరీలో పోస్ట్ చేశాడు. 'అబ్ ఐసా బన్నా నహీ, భలే ఘయల్ హో జానా. తుఝే ఫూల్ సంజే కోయి, తు ఫైర్ హో జానా' అని హిందీ పంక్తులను పేర్కొన్నాడు. 'మీకు బాధ కలిగించే పరిస్థితుల్లో మీరు నిరాశ చెందొద్దు. ఎవరైనా మిమ్మల్ని ఓ ఫ్లవర్ లాగా భావించుడొచ్చు. మీరు ఫ్లవర్ కాదు ఫైర్ అని చూపించేలా మారండి.' అని ఈ పదాలకు మీనింగ్.
ఐపీఎల్లో భారీ ధర
ఈ ఏడాది ఫిబ్రవరిలో జరిగిన ఐపీఎల్ 2022 మెగా వేలంలో ₹15.5 కోట్ల భారీ మొత్తానికి ఇషాన్ను ముంబై ఇండియన్స్ దక్కించుకున్న సంగతి తెలిసిందే. తొలి భాగంలో అతను రాణించలేకున్నా.. మళ్లీ పుంజుకున్నాడు. 14 ఇన్నింగ్స్ల్లో ఇషాన్ మూడు అర్ధ సెంచరీలతో సహా 32.15 సగటుతో 418పరుగులు చేశాడు. ఇషాన్ జూన్లో దక్షిణాఫ్రికాతో స్వదేశంలో జరిగిన సిరీస్కు ఎంపికయ్యాడు. ఆ సిరీస్లో కూడా రెండు అర్ధ సెంచరీలు చేశాడు.

వరుసగా ఆరు ఇన్నింగ్స్లలో పేలవంగా..
ఇక ఇంగ్లాండ్, వెస్టిండీస్ పర్యటనలలో ఇషాన్కు పెద్దగా అవకాశాలు దక్కలేదు. ఆరు టీ20 గేమ్లలో కేవలం రెండు మ్యాచ్లు మాత్రమే ఆడాడు. చివరి ఆరు అంతర్జాతీయ ఇన్నింగ్స్లలో అతని స్కోర్లు 27, 15, 3, 8, 11గా ఉన్నాయి. దీని వల్లే సెలెక్టర్లు కిషన్ను ఎంచుకోవడానికి కాస్త సంకోచించినట్లు కన్పించింది. పదే పదే ఫ్రంట్ ఫుట్ షాట్లు ఆడుతూ వికెట్ చేజార్చుకుంటున్న ఇషాన్కు ఇప్పుడు భారీ మూల్యం తప్పలేదు. దక్షిణాఫ్రికా సిరీస్ తర్వాత అదే టెంపో కంటిన్యూ చేసి ఉంటే అతను తప్పకుండా ఆసియాకప్కు సెలెక్ట్ అయ్యేవాడు. అయినప్పటికీ 2022లో 14 టీ20 ఇన్నింగ్స్లో అతను 142.99 స్ట్రైక్ రేట్తో 44.90సగటుతో 449 పరుగులు చేశాడు.


Click it and Unblock the Notifications
